Advertisement

Advertisement


Home > Movies - Press Releases

థియేటర్లోకి ఒరేయ్ బుజ్జిగా

థియేటర్లోకి ఒరేయ్ బుజ్జిగా

కరోనా కారణంగా థియేటర్లలోకి రాలేక, ఓటిటిలో విడుదలైన సినిమా ఒరేయ్ బుజ్జిగా. యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది. గతంలో థియేటర్లలోకి వచ్చాక ఓటిటి లోకి వచ్చేది. ఇప్పుడు వ్యవహారం రివర్స్ అయింది. 

ఒరేయ్ బుజ్జిగా సినిమా థియేటర్లలోకి వదలుతున్న సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ``2021కి స్వాగ‌తం ప‌లుకుతూ నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల‌చేస్తున్నాం`` అన్నారు.

ఓటిటి లో చూడలేకపోయిన, చూడడానికి అవకాశం లేకపోయిన వారంతా  థియేటర్ లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నామన్నారు.

అన్నీ బాగుండి వుంటే థియేటర్లోకి వచ్చి వుండేదని కానీ కరోనా కారణంగా అలా జరగలేదని, చివరకు ఓటిటిలో విడుదల చేసామని, అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు థియేటర్లలోకి తీసుకువస్తున్నామని రాధామోహన్ వివరించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?