అమ్మ‌కానికి వైజాగ్‌!

ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా, నన్ను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా చిప్ దొ … ది అన్నా, సైకో అన్నా నో ప్రాబ్ల‌మ్. ఒకటైతే ఖాయం

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌ర‌ల్డ్ బ్యాంక్‌కు రాష్ట్రాన్ని తాక‌ట్టు పెడుతున్నార‌నే ఆవేద‌న‌తో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, ఆర్థిక నిపుణుడు అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే పేరుతో రాసిన పుస్త‌కం అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిది. అప్ప‌టి పాల‌కుడెవ‌రో సులువుగా ఊహించుకోవ‌చ్చు. నారా చంద్ర‌బాబునాయుడి పాల‌న‌లో ప్ర‌భుత్వానికి సంబంధించిన భూముల్ని ఎవ‌రెవ‌రికో తాక‌ట్టు పెట్ట‌డం నాడు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. రాష్ట్ర పాల‌కుడు కాదు, అమ్మ‌కం పెట్ట‌డానికే అధికారాన్ని వాడుకుంటున్నాడ‌ని బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వెల్లువెత్తాయి.

ఇప్పుడు రాష్ట్రాన్ని చంద్ర‌బాబునాయుడే పాలిస్తున్నారు. అమ్మ‌కానికి వైజాగ్ అంటూ మాజీ ఎంపీ కేశినేని నాని పోస్ట్ తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. వైసీపీ హ‌యాంలో వైజాగ్‌ను దోచేస్తున్నార‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ నాయ‌క‌త్వంలో తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పుడు జ‌రుగుతున్న‌దేంటి? వైజాగ్‌లో అత్యంత విలువైన భూముల్ని కారుచౌక‌గా కొన్ని కంపెనీల‌కు క‌ట్ట‌బెట్ట‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ కేశినేని నాని ఉర్సా క్ల‌స్ట‌ర్స్ కంపెనీకి సుమారు 60 ఎక‌రాలు కేవ‌లం 99 పైస‌ల‌కు క‌ట్ట‌బెడుతున్నారంటూ విరుచుకుప‌డ్డారు. దీని వెనుక విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నాడ‌ని ఆయ‌న ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. దీంతో చిన్నికి అన్న‌పై కోపం వ‌చ్చింది. ఆయ‌న‌కు చిప్ దొబ్బింద‌ని, విజ‌య‌వాడ‌లో ఒక సైకో తిరుగుతున్నార‌ని, జాగ్ర‌త్త‌గా వుండాలంటూ ఎన్టీఆర్ జిల్లా ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

త‌మ్ముడి వెట‌కారంపై మ‌రోసారి కేశినేని నాని ఘాటుగా స్పందించారు.

“ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా, నన్ను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా చిప్ దొ … ది అన్నా, సైకో అన్నా నో ప్రాబ్ల‌మ్. ఒకటైతే ఖాయం …Vizag is for sale. #ursaclusters” అని సోష‌ల్ మీడియాలో స్ప‌ష్టం చేశారు. సైకో అన్నంత మాత్రాన, త‌న‌తో మైండ్‌గేమ్ ఆడితే వెన‌క్కి త‌గ్గ‌న‌ని కేశినేని నాని మ‌రోసారి ఈ పోస్టు ద్వారా సంకేతాలు పంపిన‌ట్టైంది.

ఉర్సా కంపెనీకి అప్న‌నంగా భూములు క‌ట్ట‌బెట్ట‌డం వెనుక విజ‌య‌వాడ ఎంపీ ఉన్నార‌నేది నాని ఆరోప‌ణ‌. అందులోని డైరెక్ట‌ర్ స‌తీష్ వ్యాపారం, రాజ‌కీయ నేప‌థ్యం ఎంత అధ్వాన‌మైందో కూడా ఇప్ప‌టికే నాని చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఊరు, పేరు లేని కంపెనీకి భారీగా భూమి క‌ట్ట‌బెట్ట‌డం అంటే, విశాఖ‌ప‌ట్నాన్ని అమ్మ‌కానికి పెట్ట‌డ‌మ‌ని కేశినేని భావ‌న‌.

13 Replies to “అమ్మ‌కానికి వైజాగ్‌!”

  1. 🔥 జగన్‌ను ప్రజలు ఓడించలేదు… నేరుగా చెంపదెబ్బ కొట్టారు!

    ఇది ఓ సాధారణ ఓటింగ్ ఫలితం కాదు బాస్…

    ఇది ప్రజల కోపం, అసహనం, అవమానానికి ఇచ్చిన ప్రతిస్పందన!

    👉 తల్లిని కోర్టుకి లాగిన వాడికి ప్రజలు గౌరవం చూపారా?

    👉 చెల్లిని అవమానపరిచిన వ్యక్తికి ఇంకెవరైనా అండగా నిలుస్తారా?

    ప్రజలు ఏం చేశారు తెలుసా?

    ఒక నిమిషం కూడా వెనక్కి చూసుకోకుండా, ఒక్క ఓటుతో నేరుగా గుద్దిన చెంపతాటు వేశారు.

    📉 151 నుంచి 11? ఇదెక్కడ ఓ సాధారణ ఓటు తేడా లా ఉంది?

    ఇది ఒక మౌన తిరుగుబాటు కాదు… ఇది ఓ గర్జన!

    ఓట్ల ద్వారా ప్రజలు జగన్‌కి చెప్పిన తుది తీర్పు: “జనం మాయలో పడే రోజులు ముగిశాయి!”

    ఇప్పుడు YCP పేరు వింటేనే జనం చిరాకుపడుతున్నారు.

    గ్రామాల్లో ఫ్లెక్సీలు లేవు, పట్టణాల్లో క్యాడర్ మాయం, నగరాల్లో ఆది అభిమానం మిగల్లేదు.

    💥 ఇది ఓటింగ్ కాదు…

    ఇది ప్రజల చేతిలో వాలిన అర్హత చెంపదెబ్బ.

    ఇది జగన్‌పై వేసిన ముద్ర – “ఇక ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు!”

    #చెంపతాటు2024

    #తీవ్రతిరస్కారం

    #JaganRejected

    #SelfRespectVote

    #NeverAgainJagan

    #YSRCPGone

    #PublicSlap

    #AndhraDecided

  2. “ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌ర‌ల్డ్ బ్యాంక్‌కు రాష్ట్రాన్ని తాక‌ట్టు పెడుతున్నార‌నే ఆవేద‌న‌తో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌,”….we know those coverts..undavalli, ivr, vizag sharma friends…

  3. అప్పట్లో ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్న వె..ధ..వ లందరూ ఇప్పుడు తప్పు అని చెంపలేసుకుంటూ అదే పని చేస్తున్నారు. కంప్యూటర్ లు బువ్వ పెడతాయా బాబూ.. అని బఱ్ఱె గొంతెసుకొని వాగారు.

      1. అవును, ఉర్సు కంపెనీ కి రూపాయికి ఎకరం అనేది పూర్తిగా అసత్యం. TCS కి అలా ఇస్తున్నారు కానీ ఉర్సు కంపెనీకి కాదు. ఉర్సుకి ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడు ఎకరాలు , మిగతా ల్యాండ్, ఎకరం 56 లక్షలు చొప్పున అలాట్ చేశారు. 32 మంది కమ్మ DSP లకి ప్రమోషన్ , లేని పింక్ డైమండ్ ని కొట్టేశారని చెప్పినట్లే వుంది ఈ అబద్ధాలు కూడా. ఈ ల్యాండ్ ఎలాట్మెంట్ లో ఏదైనా ఫ్రాడ్ ఉంటే ఎవరైనా కోర్ట్ కి వెళ్ళవచ్చు.

      2. That is Development. Microsoft bought land in Hyderabad. TCS bought. In VIZAG, why we need to give it for free? On top of it , allotment to a company of just 6 months old. These guys use this land allotment to get nice deals from other companies and develop their assets. It’s development in Andhra. 

    1. Please open your eyes blind folded by yellow media. Even Krishna from Karnataka claimed as “God of IT sector” in Bangalore. CBN did very little but media hype was a lot. His contribution is limited . It helped his cronies a lot . Publicity and false propaganda, lies are part of the scheme. Anyway, no one can change a few people. KCR did the best for agriculture in Telangana . Agriculture was ignored in previous Governments and all were his initiatives. IT was in boom and centre ( PV sir) supported and started . Check media not eenadu. Congress government neduramalli started IT initiatives and signedMOUs . The process started and completed in the next Government ( TDP). Media hyped . KCR and YSR were real initiators of Agriculture and irrigation projects. They were 100% state government initiatives. YSR arogyasri (Public health) and fee reimbursement schemes are his own initiatives. E-Seva ( copied from TM krishna of Karnataka) was CBN initiative in Andhra. Check facts but don’t be blindfolded by TDP or YCP supported media. Use brain. BJP’s core development is : Infra development ( transport) which helped India. No one thought in those lines except British prior to Independence. 

Comments are closed.