వైసీపీ లోక్‌స‌భ ప్లోర్ లీడ‌ర్‌గా మిధున్‌, విఫ్‌గా గురుమూర్తి

వైసీపీ లోక్‌స‌భ ప్లోర్ లీడ‌ర్‌గా పీవీ మిధున్‌రెడ్డి, అలాగే విఫ్‌గా డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తిని ఆ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నియ‌మించారు. ఈ మేర‌కు త‌మ ప్ర‌తిపాద‌న‌ల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలంటూ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు…

వైసీపీ లోక్‌స‌భ ప్లోర్ లీడ‌ర్‌గా పీవీ మిధున్‌రెడ్డి, అలాగే విఫ్‌గా డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తిని ఆ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నియ‌మించారు. ఈ మేర‌కు త‌మ ప్ర‌తిపాద‌న‌ల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలంటూ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు జ‌గ‌న్ లేఖ రాశారు. త్వ‌ర‌లో పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభమ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నియామ‌కాల్ని జ‌గ‌న్ చేప‌ట్టారు. వైసీపీకి లోక్‌స‌భ‌లో న‌లుగురు ఎంపీలున్నారు. రాజంపేట‌, తిరుప‌తి లోక్‌స‌భ స్థానాల నుంచి మిధున్‌రెడ్డి, గురుమూర్తి ఎన్నిక‌య్యారు. వైసీపీ న‌లుగురి ఎంపీల్లో గురుమూర్తి ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుప‌తి లోక్‌స‌భ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ, జ‌న‌సేన అభ్య‌ర్థులు గెలుపొందారు. అయిన‌ప్ప‌టికీ గురుమూర్తి విజ‌యం సాధించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

భారీగా క్రాస్ ఓటింగ్ జ‌రిగింది. 2019లో తిరుప‌తి ఎంపీగా బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఎన్నిక‌య్యారు. అనారోగ్య కార‌ణంతో ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణం చెందారు. దీంతో ఉప ఎన్నిక స‌మ‌యంలో గురుమూర్తి రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చారు. మొద‌ట్లో ఆయ‌న‌పై ఎవ‌రికీ ఎలాంటి అంచ‌నాలు లేవు. ఎంపీగా గెలిచిన గురుమూర్తి, రెండేళ్ల ప‌ద‌వీ కాలంలో ఎన్నో అభివృద్ధి ప‌నులు చేశారు.

అలాగే రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రితోనూ అభిమానంగా మెలుగుతూ వ‌చ్చారు. వివాదాల‌కు దూరంగా, అభివృద్ధే ఏకైక ఎజెండాగా ఎంపీగా త‌న‌కొచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు. అందుకే క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో దాదాపు 1.50 ల‌క్ష‌ల క్రాస్ ఓటింగ్ జ‌రిగి, గురుమూర్తి తిరుప‌తి లోక్‌స‌భ విజేత‌గా నిలిచారు. గురుమూర్తికి విఫ్ ప‌ద‌వి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

6 Replies to “వైసీపీ లోక్‌స‌భ ప్లోర్ లీడ‌ర్‌గా మిధున్‌, విఫ్‌గా గురుమూర్తి”

  1. బెల్లం కొండపై బాలకృష్ణ తుపాకీ ఎందుకు కాల్పులు జరిపారనే ప్రశ్న ఇప్పటికీ నా మనసులో ఉంది. ఎందుకు?

  2. :red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

  3. :Leeki red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

    తానిబాన్ చట్టం ప్రకారం, తానిబాన్ నియమాలను పాటించకపోతే చంపేస్తారు.

    రెడ్ బుక్ ప్రకారం, టీడీపీ పార్టీ సభ్యుడు కాకపోతే, మిమ్మల్ని చంపేస్తారు

Comments are closed.