గవర్నర్ ను కలిసిన చిరంజీవి!

ఇటీవలే తెలంగాణ గవర్నర్ గా నియమితం అయిన తమిళ సై సౌందరరాజన్ ను కలిశారు సినీ నటుడు చిరంజీవి. దసరా శుభాకాంక్షలను చెప్పడానికే ఆమెతో చిరంజీవి సమావేశం అయినట్టుగా  ప్రకటన విడుదల చేశారు. ఇన్నేళ్లూ…

ఇటీవలే తెలంగాణ గవర్నర్ గా నియమితం అయిన తమిళ సై సౌందరరాజన్ ను కలిశారు సినీ నటుడు చిరంజీవి. దసరా శుభాకాంక్షలను చెప్పడానికే ఆమెతో చిరంజీవి సమావేశం అయినట్టుగా  ప్రకటన విడుదల చేశారు. ఇన్నేళ్లూ తమిళనాడు రాజకీయంలో బిజీగా ఉండిన తమిళ సై తో చిరంజీవికి వ్యక్తిగత పరిచయాలు ఏమైనా ఉండేవేమో కానీ ఈ సమావేశం మాత్రం ఆసక్తిదాయకంగా మారింది.

భారతీయ జనతా పార్టీ నేతగా వ్యవహరించిన తమిళ సైని తెలంగాణకు పంపించడంలో.. ఆ పార్టీకి వ్యూహం ఉందని, తెలంగాణలో బీజేపీ బలోపేతమే ఆ  వ్యూహం అనే ప్రచారం ఒకటి ఉంది. ఇప్పుడు చిరంజీవి వెళ్లి ఆమెతో సమావేశం కావడం ఆసక్తిదాయకంగా మారింది. అయితే ఈ సమావేశంలో రాజకీయం ఏమీ లేదనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక తన తాజా సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ని చూడాలని గవర్నర్ ను ఆహ్వానించారట మెగాస్టార్.  త్వరలోనే చూస్తానంటూ ఆమె స్పందించారని సమాచారం.