ప‌ది టైర్ల లారీల‌తో… అర్ధ‌రాత్రి య‌థేచ్ఛ‌గా!

ఉచితంగా ఇసుక పంపిణీ… ఉత్తుత్తిదే అని తేలిపోయింది. ఉచితం మాటున టీడీపీ నాయ‌కులు య‌థేచ్ఛ‌గా ఇసుక త‌ర‌లిస్తూ, ప్ర‌కృతి వ‌న‌రుల్ని దోచుకుంటున్నారు. ఈ వాతావ‌ర‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో…

ఉచితంగా ఇసుక పంపిణీ… ఉత్తుత్తిదే అని తేలిపోయింది. ఉచితం మాటున టీడీపీ నాయ‌కులు య‌థేచ్ఛ‌గా ఇసుక త‌ర‌లిస్తూ, ప్ర‌కృతి వ‌న‌రుల్ని దోచుకుంటున్నారు. ఈ వాతావ‌ర‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ముఖ్య నాయ‌కుడు త‌న అనుచ‌రులను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారం ఇసుక‌ను దోపిడీ చేస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

వేంప‌ల్లె మండ‌లంలోని అలిరెడ్డిప‌ల్లె పంచాయ‌తీ ప‌రిధిలోని ఏటి నుంచి ప్ర‌తి రోజూ ప‌ది టైర్ల లారీల్లో రాత్రివేళ ఇసుక‌ను త‌ర‌లిస్తున్నారు. ఇలా రోజుకు ప‌ది భారీ లారీల్లో ఇసుక‌ను దోచేస్తుండ‌డంపై ఆందోళ‌న నెల‌కుంది. క‌నీసం రీచ్‌, ఇసుక స్టాక్‌యార్డ్ కూడా లేకుండానే, శ్యాండ్‌ను ఎలా త‌ర‌లిస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

ఒక‌వైపు చంద్ర‌బాబునాయుడు ఇసుకను అక్ర‌మంగా త‌ర‌లించొద్ద‌ని, ఎమ్మెల్యేలు, కూట‌మి నాయ‌కుల ప్ర‌మేయం వుండొద్ద‌ని హెచ్చ‌రించ‌డం తెలిసిందే. ఇవ‌న్నీ ప్ర‌చారానికే త‌ప్ప‌, ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు ఇసుక దోపిడీ చేయకుండా అడ్డుకోలేక‌పోతున్నాయ‌నే విమ‌ర్శ‌.

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డినా ఎవ‌రూ అడ్డుకోలేర‌ని, అన‌ధికారికంగా చంద్ర‌బాబు అనుమ‌తి ఇచ్చార‌నే మాట‌ల‌తో స‌ద‌రు టీడీపీ నాయ‌కుడు “టెక్” ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

అలిరెడ్డిప‌ల్లె పంచాయ‌తీ ప‌రిధిలోని ఏటి నుంచి ఇసుక‌ను నంద్యాల‌, క‌ర్నూలు, తిరుప‌తి జిల్లాల‌తో పాటు క‌ర్నాట‌క‌కు కూడా త‌ర‌లిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు స‌ర్కార్ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ఆ నాయ‌కుడి ప్ర‌కృతి వ‌న‌రుల దోపిడీని అరిక‌ట్టాల‌నే డిమాండ్ వ్య‌క్త‌మ‌వుతోంది.

31 Replies to “ప‌ది టైర్ల లారీల‌తో… అర్ధ‌రాత్రి య‌థేచ్ఛ‌గా!”

  1. ఇది నిజం కూడా అయ్యి ఉండవచ్చు. కానీ జనం మనం ఏది చెప్పినా నమ్మే పరిస్థితి లేకున్నాం.కామెడీ కాకపోతే ఏంటి
  2. రాత్రి దోపిడీ అని పగటి ఫోటో పెట్టవేమీ? రాసేటపుడు వార్తలు వెరిఫై చేసుకో, ఇలానే జగన్ ప్రాపకం కోసం ఏవేవో రాసి 11సీట్లకు దించారు

  3. తల్లికి వందనం హామీ అటకెక్కింది…

    తండ్రికి ఇంధనం హామీ ఎక్కడివరకు వచ్చిందో జాడ లేదు.

    బూమ్ బూమ్ ని 999 పౌరులే!ని స్టార్ కింద మార్చేసి చేతులు దులుపుకున్నారు.

    ఆన్లైన్ లో ప్రభుత్వానికి టన్నుకు 350/- కడితే వచ్చే ఇసుకని

    ఉచితం పేరుతో టన్నుకు 1200/- అయ్యేలా సీనరేజి కవరింగ్ మొదలెట్టారు.

    ఉచితం అంటే ప్రభుత్వానికి ఏమి రాదు….అంతా గుల కమిటీలకే.

    ఇంటింటికి పెన్షన్ అని వీధి చివర గుల కమిటీ వాళ్ళతో 100-500 భ్రమరావతి ఇటుకల కోసం కోసేస్తున్నారు.

    మొన్న విద్యుత్ చార్జీల గురించి గంట సొల్లు చెప్పాడు బాబు.

    మరి మీరు తగ్గిస్తున్నారా అంటే…నీళ్లు నమిలి…

    సర్ ఛార్జ్ లేకుండా బొగ్గు ఎలా కొనాలి అని జగన్ చేసిందని కరెక్ట్ అని ఒప్పుకున్నాడు.

    మాల వేసుకొని ప్రజలని మోసం చేస్తున్నారు. అబద్దాలు అలవోకగా చెప్పేస్తున్నారు.

    ఒక్క ఇటుక కూడా పెట్టకుండా ఉద్దానం నీటి పథకానికి పేర్లు వేసుకున్నారు.

    ఇన్నాళ్లు చక్కగా ప్రభుత్వం అన్ని ఇంటి దగ్గరకి తీసుకొచ్చి ఇస్తుంటే

    పంటలు పండించుకుంటూ, పనులు చేసుకుంటూ హాయిగా వున్నారు..ఖాళీబుర్రకి పని చెప్పి లే!నిపో!నివన్నీ అలోచించి పసుపుపతికి ప్రాణభిక్ష పెట్టారు…వాడు మీ ప్రాణాలని హరించేదాకా నిద్రపోడు.

    నేను ఎప్పటినుండో మొత్తుకుంటున్నాను…

    కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పేవాడిని నమ్మకండి అని…

    కనీసం తాగడానికి నీళ్లు దొరక్క అల్లాడే రోజులు ఎంతో దూరంలో లేవు…

    దేవుడు వాన లేకుండా వరదలు, కరువు ఛాయలు స్పష్టంగా చూపిస్తున్నాడు.

  4. తల్లికి వందనం హామీ అటకెక్కింది…

    తండ్రికి ఇంధనం హామీ జాడ లేదు.

    బూమ్ బూమ్ ని 999 పౌరులే!ని స్టార్ కింద మార్చేసి చేతులు దులుపుకున్నారు.

    రైతు భరోసా అతీగతీ లేదు.

    ఉచిత బస్సు కృష్ణాలో కలిపేశారు.

    ఆన్లైన్ లో ప్రభుత్వానికి టన్నుకు 350/- కడితే వచ్చే ఇసుకని

    ఉచితం పేరుతో టన్నుకు 1200/- అయ్యేలా సీనరేజి కవరింగ్ మొదలెట్టారు.

    ఉచితం అంటే ప్రభుత్వానికి ఏమి రాదు….అంతా గుల కమిటీలకే.

    గతంలో ఏడాదికి (2 ఏళ్ళు కోవిద్ కలిపి) 750 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక ద్వారా.

    ఇంటింటికి పెన్షన్ అని వీధి చివర గుల కమిటీ వాళ్ళ ఇళ్లల్లో 100-500 భ్రమరావతి ఇటుకల కోసం కోసేస్తున్నారు.

    ఒసేయ్ ఆంధ్రదేశమా…నీకు మంచి రోజులా…

    వదల బొమ్మాళీ…వదల బొమ్మాళీ…వదల

    పిందె…పండయ్యిందే….

    (19-24) సంక్షేమం, అభివృద్ధితో కళకళలాడుతుందే

    వదల బొమ్మాళీ…వదల

    అంటూ పసుపుపతి మిమ్మల్ని మాయలో ముంచేశాడు…

    ఇప్పుడు ఘోరమైన పాలనా చూస్తూ roju ఏడవటమే ఆంధ్రుల పని.

    1. కి కి కి..

      ప్యాలస్ పులకేశి వేసుకునే పిచ్చి కి ట్యాబ్లెట్లు నీకు కూడా. ఇస్తాడే మో కనుక్కో.

  5. ఆ పైన ఫోటో 26 జిల్లాల్లో బులుగు పార్టీ పాలస్ కట్టేటప్పుడు జగన్ తరలించిన ఇసుక లారీలు ,అప్పట్లో ప్రతిపక్షం బయట పెట్టిన ఫోటోలు ఇవి

Comments are closed.