ఏపీ ప్ర‌జానీకం చెవిలో రాజ‌ధాని పుష్పం

ఇంత‌కూ ఆ భూముల రేట్లు పెరిగేదెన్న‌డు? అప్పులు తీర్చేదెన్న‌డు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం లేదు.

ఏపీ ప్ర‌జానీకం చెవిలో మున్సిప‌ల్‌శాఖ మంత్రి నారాయ‌ణ రాజ‌ధాని పుష్పం పెట్టాల‌ని చూస్తున్నారు. రాజ‌ధాని నిర్మాణం కోసం ఏపీ స‌ర్కార్ భారీగా అప్పులు చేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్ర‌భుత్వం ష్యూరిటీ ఇస్తున్న‌ట్టు లోక్‌స‌భ స‌మావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా చెప్పారు. అయితే రాజ‌ధాని అప్పుల భారం రాష్ట్ర ప్ర‌జానీకంపై ప‌డ‌ద‌ని మంత్రి నారాయ‌ణ చెబుతున్నారు. వినేవాళ్లుంటే, కూట‌మి పాల‌కులు ఏమైనా చెబుతార‌నే అభిప్రాయం ఇప్ప‌టికే జ‌నాల్లో వుంది.

కూట‌మి స‌ర్కార్‌కు రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం మొద‌టి ప్రాధాన్య అంశ‌మైన సంగ‌తి తెలిసిందే. దీన్ని దాచి పెట్టాల‌ని ప్ర‌భుత్వం అనుకోవ‌డం లేదు. రాష్ట్రాన్ని ప‌స్తులు పెట్టైనా స‌రే, రాజ‌ధానిని రాత్రికి రాత్రి నిర్మించేస్తే, ఆ త‌ర్వాత అధికారంలోకి ఎవ‌రొచ్చినా భూముల ధ‌ర‌ల‌కు ఇబ్బంది వుంటుంద‌నే అభిప్రాయం పాల‌కుల్లో వుంద‌నే చర్చ‌కు తెర‌లేచింది. రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు టెండ‌ర్లు పూర్త‌య్యాయి. మ‌రికొన్ని కావాల్సి వుంది.

ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని ప్రాంతంలో మంగ‌ళ‌వారం మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌పై ఒక్క పైసా భారం ప‌డ‌కుండా రాజ‌ధాని నిర్మాణం పూర్తి అవుతుంద‌న్నారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్‌, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. రాజ‌ధాని ప్రాంతంలో భూమి విలువ పెరిగిన త‌ర్వాత‌, దాన్ని అమ్మి అప్పు తీరుస్తామ‌ని నారాయ‌ణ సెల‌విచ్చారు. రాజ‌ధాని కోసం హ‌డ్కో నుంచి రుణం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

అప్పు అంటేనే, తీసుకున్న మ‌రుక్ష‌ణం నుంచి వ‌డ్డీ చెల్లించాల్సి వుంటుంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌పంచ బ్యాంక్ రుణం అంటే ఎలా వుంటుందో, దాని నుంచి తీసుకున్న దేశాలకు ఏ గ‌తి ప‌ట్టిందో క‌థ‌లుక‌థ‌లుగా చెబుతుంటారు. అలాంటిది రాజ‌ధాని నిర్మాణం కోసం తీసుకొచ్చే అప్పుల‌తో ప్ర‌జానీకానికి సంబంధం లేద‌న్న‌ట్టు నారాయ‌ణ మాట్లాడ్డం విస్మ‌యం క‌లిగిస్తోంద‌ని ప‌లువురు అంటున్నారు.

రాజ‌ధానిలో భూముల‌కు రేట్లు పెరిగితే అప్పు తీరుస్తామ‌ని నారాయ‌ణ అన‌డం వ‌ర‌కే బాగానే వుంది. ఇంత‌కూ ఆ భూముల రేట్లు పెరిగేదెన్న‌డు? అప్పులు తీర్చేదెన్న‌డు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం లేదు. రాజ‌ధానిలో అంద‌రూ త‌మ ప్లాట్ల‌ను విక్ర‌యించాల‌ని అనుకుంటున్నారు. కానీ కొనేవాళ్లే క‌రువ‌య్యారు. అలాంట‌ప్పుడు భూముల‌కు రేట్లు పెరిగే వ‌ర‌కూ, అప్పు, వ‌డ్డీతో క‌లిపి రాష్ట్రానికి మోయ‌లేని భారంగా మార‌దా? అని ఆర్థిక‌వేత్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు. వాస్త‌వాల్ని దాచి, రాష్ట్ర ప్ర‌జానీకంలో చెవిలో రాజ‌ధాని పుష్పం పెట్టాల‌ని నారాయ‌ణ చూస్తున్నార‌న‌డంలో అనుమానం ఏముంది?

58 Replies to “ఏపీ ప్ర‌జానీకం చెవిలో రాజ‌ధాని పుష్పం”

  1. మన జగన్ రెడ్డి విశాఖ లో భూములు అమ్మేసినప్పుడు .. ఈ పుష్పాలు మీకు కనపడలేదా..?

    500 కోట్లు జనాల డబ్బుతో.. తన సొంతానికి పాలస్ కట్టుకున్నప్పుడు.. ఈ పుష్పాలు మీకు కనపడలేదా..?

    ..

    డెవలప్మెంట్ జరిగితే.. భూముల రేట్లు సచ్చినట్టు పెరుగుతాయి..

    మీకు మాత్రం ఎప్పుడు పెరుగుతాయో.. ఖచ్చితమైన సమాచారం కావాలని గోల పెట్టేస్తున్నారు..

    రాష్ట్రానికి మంచి చేయని మీకు.. ముంచేసే ఆలోచనలు మాత్రమే ఉంటాయి.. నీలాంటి వాళ్లకు లెక్కలు, ఆలోచనలు, ప్రణాళికలు చెప్పుకోవాల్సిన పని లేదు..

    ..

    మూడేళ్ళలో నీ జగన్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తాడంట కదా.. అంతవరకూ కళ్ళు, నోరు, గుద్దా మూసుకుని ఉండు..

    జరిగేవన్నీ జరుగుతాయి.. ఇక నువ్వు తెరిచి చూసుకోవడమే..

  2. అయినా అమరావతి మేము వొస్తే తిరిగి కడతాం అని ఎన్నికలో చెప్పే కదా గెలిచారు .. ఎన్నికల ముందు ఒకటి ..గెలిచినా తరువాత ఒకటి చేయడం లేదు కదా వెంకట్రావు ..

  3. అమరావతి రాజధాని ని సాధ్యమైనత త్వరగా డెవలప్ చేయాలి. మళ్ళీ మార్చలానం ఆలోచన కూడా ఎవరికీ రాకూడదు. ఆంధ్రుల రాజధాని అమరావతి .

    2024 ప్రజల తీర్పు కూడా అమరావతి కోసమే .

    అవసరమైతే కొన్ని పథకాలు అపి ఐన అమరావతి కి ఖర్చు చేయాలి.

    YSR CP పడకల పైన గోల చేస్తుంది TDP వాళ్ళను పాటించుకుంటే TDP కి కూడా జగన్ గతే పడుతుంది.

    TDP ని గెలిపించింది అమరావతి కోసమే

    పథకాలే కావాలంటే జగన్ కి 11 వచ్చేవి కాదు

    1. కలగనండి ఇచ్చిన పధకాలు అమలుచేయమను అప్పుడు ముప్పై ఏళ్లన్న పరిపాలించమను అప్పుడే చేతులెత్తేశారు .

      1. అంతే మన జీవితం .. పధకాలు ఉంటె చాలు .. కష్టపడి సంపాదించుకోవడం లేదు ..

  4. అందుకేరా సన్నాసి చదువుకున్నవాళ్ళని పెట్టుకోవాలి అనేది. వరల్డ్ బ్యాంకు రుణం కానీ , హుదుకో ఋణం కాని మొదటి అయిదు ఏళ్ళు మారటోరియం ఉంది. అంటే ఐదు ఎల్లావరకు వడ్డీ ఉండదు. రాజధాని అందరు ప్లోట్లు విక్రయిస్తారా? ఎం అన్న పంచిన ప్రెసిడెంట్ మెడల్ దాచుకొని తాగుతున్నావా?ఎవరా ఆర్థికవేత్తలు? మీ సన్నాసి బెచ్చ?నీకు బుర్ర అరికాలులో కూడా లేదు అనడానికి అనుమానం ఏముంది?

  5. Even if people pays the interest for the debt, nothing wrong with it. It’s a capital investment which would generate income for the entire state in the long run.

    Do upper and middle-class individuals believe that spending borrowed money on welfare programs (for helping weaker sections) is an unnecessary waste of money? Absolutely, not! Its a humanity!

    Dont provoke people? It will create lot of differences among people.

  6. గతంలో ఒకడు ఒకే చెవిలో మూడు పుష్పాలు పెట్టాలని చూశాడు … నీకేమైనా చెప్పామా ..

  7. Unless there is growth in jobs and business investments, land prices will not grow. Land prices are not dependent on infrastructure creation but instead infrastructure will be shown as means to attract investments. However, till date, not a single company has invested in Amaravathi region which explains the sad state of our capital which was decided without any vision.

    1. మటన్ షాపులు ఫిష్ మార్కెట్లు తెద్దాం లే రాజా. అంత గొప్ప ఆలోచన రావాలంటే వాడు జగన్ మోహన్ రెడ్డి అయి ఉండాలి

      1. Begging for commissions on liquor sales is the best this alliance government could come up with till now. Also, theybahave nothing else to do except opening tea shops and promoting liquor sales.

        1. commissions గురించి మీరే మాట్లాడాలి మరి, రాష్ట్రాన్ని దోచుకున్నారు, దోచుకున్న దాంట్లో మేడం గారికి ఎప్పటికప్పుడు కప్పం కట్టారు.

          సొంత లిక్కర్ బ్రాండ్లు, పేపర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్…అబ్బో ఎందుకులే.

          పాన్ షాపులు, చాట్ బండ్లు, చేతి పంపు/ బోరింగ్ ఓపెనింగులు ఎన్ని చూడలేదు

          1. Prove it and send to jail. Who is stopping you? Your statements are as fake as you and your alliance promises and allegations. Wake up as people already started laughing at your comments and by 2029 they will spit on your faces if you continue to make these baseless allegations.

    2. In last 5 years Jagan has stopped all works in Amaravati and kicked out all investments and tried to kill Amaravati. Now only they are about to start works.

      Just wait for 3 more years from now and see.

  8. Amaravathi does not have a port to attract manufacturing industries, it does not have vast barren land pool available to attract green energy plants, it does not have the opportunity to attract software or telecom industries with its close proximity to Hyderabad. How will this visiom-less choice attract huge investment?

    1. correct .. you are right .. button pressing padhakalu has lot of vision .. what is this amaravathi and all this .. press buttons please ..

          1. Supporting central government but still could not ask for grants compared to what Bihar has achieved and you talking about promises made about special status. First look at what this government fulfilled before questioning what Jagan did which is far more superior and cannot be comparable. Go clean your $hit first.

          1. వాడు గడప దాటి బయటకు రాడు, అసెంబ్లీ కి వెళ్ళడు, ప్రజల కష్టాలు పట్టించుకోడు, పార్టీకి కార్యకర్తల సభ్యత్వం లేదు, లీడర్లు తలో దారి చూసుకుంటున్నారు….అయినా నీకు ఇంకా ఆశ చావలేదు

          1. Your supported party formed an alliance and is in government today. If I give all the data what will the alliance leaders do? Enjoy Jabardasth skits in name of cultural activities or collect commissions from liquor?

    2. Machilipatnam port is already there…

      Solar energy plants are not kept in cities. They are kept normally in remote places!

      Since it is near to HYD, Amaravati can quite easily attract IT industry as the cost of living, traffic and pollution has become more in hyd.

      Already we have seen huge investments in education sectors. Like VIT, Amaravati, SRM, BITS, XLRI and many more about to come. Soon many IT companies will also come once the basic infra in completed there! There is lot of land available which was gathered in land pooling! so Development is a natural activity there!!

  9. మూడూ రాజధానులు అని పుష్పం పెట్టింది మన జగన్ అన్నే!

    .

    నిజానికి అన్ని నగరాలాలొ మౌలిక వసతులు ప్రబుత్వాలె కల్పిస్తాయి! అది విశాక అయినా, విజయవాడ అయినా, కుర్నూల్ అయినా, కడప అయినా! అయితె అమరవతి లొ మౌలిక వసతుల కల్పన మీద పడె భారాన్ని కొంత కచ్చితంగా ఆ ఆ భూములు అమ్మి తీర్చ వచ్చు! ఇక ప్రబుత్వ భవనాలు ఎక్కడ కట్టినా అదె కర్చు అవుతుంది?

    .

    రైతుల దగ్గర భూములలొ 75% ప్రభుత్వం తీసుకుంది కనుక అమరవతి లొ విశాలమయిన రొడ్లు, పార్క్లు, అలానె అబిరుద్దికి కావలసిన యూనివర్సిటీలు, కంపనీలని కూడా ఆకర్షించి పెట్తుబడులు తెవచ్చు!

    .

    మళ్ళి చెపుతున్నా… మూడూ రాజధానులు అని పుష్పం పెట్టింది మన జగన్ అన్నే!

  10. మూడూ రాజధానులు అని పు.-.ష్పం పెట్టింది మన జగన్ అన్నే!

    .

    నిజానికి అన్ని నగరాలాలొ మౌలిక వసతులు ప్రబుత్వాలె కల్పిస్తాయి! అది విశాక అయినా, విజయవాడ అయినా, కుర్నూల్ అయినా, కడప అయినా! అయితె అమరవతి లొ మౌలిక వసతుల కల్పన మీద పడె భారాన్ని కొంత కచ్చితంగా ఆ ఆ భూములు అమ్మి తీర్చ వచ్చు! ఇక ప్రబుత్వ భవనాలు ఎక్కడ కట్టినా అదె కర్చు అవుతుంది?

    .

    రైతుల దగ్గర భూములలొ 75% ప్రభుత్వం తీసుకుంది కనుక అమరవతి లొ విశాలమయిన రొడ్లు, పార్క్లు, అలానె అబిరుద్దికి కావలసిన యూనివర్సిటీలు, కంపనీలని కూడా ఆకర్షించి పెట్తుబడులు తెవచ్చు!

    .

    మళ్ళి చెపుతున్నా… మూడూ రాజధానులు అని పు.-.ష్పం పెట్టింది మన జగన్ అన్నే!

  11. మీరు అమరావతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది… ఈసారి 11 కూడా మిగలవు

Comments are closed.