విస్తరిస్తున్న ‘హోమ్’

మైహోమ్ సంస్థ సినిమా నిర్మాణ రంగంలొకి ప్రవేశించిన సంగతి ముందే వెల్లడించాం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో, హారిక హాసిని నిర్మాణాల్లో పావలా వాటా తీసుకున్న సంగతి తెలిసిందే.  Advertisement ధనుష్ సర్…

మైహోమ్ సంస్థ సినిమా నిర్మాణ రంగంలొకి ప్రవేశించిన సంగతి ముందే వెల్లడించాం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో, హారిక హాసిని నిర్మాణాల్లో పావలా వాటా తీసుకున్న సంగతి తెలిసిందే. 

ధనుష్ సర్ సినిమా దగ్గర నుంచి ఇది ప్రారంభమైంది మహేష్-త్రివిక్రమ్ సినిమా కు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఇదే విధమైన భాగస్వామ్యాన్ని మరిన్ని సంస్థలతో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.

పూరి కనెక్ట్స్ సంస్థతో మైహోమ్ చేతులు కలుపుతోంది. పూరి జ‌గన్నాధ్ ప్రారంభిస్తున్న పాన్ ఇండియా సినిమా జ‌నగనమణ నిర్మాణంలో మైహోమ్ పాలు పంచుకోబోతోంది. ఇది కాక టాలీవుడ్ లోని మరి కొన్ని నిర్మాణ సంస్థలతో కూడా మైహోమ్ సంప్రదింపులతో వున్నట్లు వార్తలు వున్నాయి. 

వడ్డీ లేని ఫండింగ్ వస్తుండడంతో, నిర్మాతలు కూడా పావలా వాటా ఇవ్వడానికి సుముఖంగానే వున్నట్లు బోగట్టా. టాలీవుడ్ లో ఫైనాన్స్ అన్నది కీలకం. రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు వడ్డీ వుంటుంది. వడ్డీ కూడా కోట్లలో అవుతుంది. 

అలా ఇచ్చుకునే బదులు లాభాల్లో పావలా వాటా ఇవ్వడం అన్నది మంచి విషయం. కానీ మైహోమ్ అన్ని సంస్థలను సంప్రదించడం లేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న పెద్ద సంస్థలను మాత్రమే సంప్రదిస్తోందని తెలుస్తోంది.