పాచిపోయిన నోటితో మాట్లాడిన పవన్!

తిరుపతి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ గట్టిగా ప్రతిస్పందించింది. ప్యాకేజీ తీసుకొని మాట్లాడే వ్యక్తి మాటల్ని తిరుపతి ప్రజలు నమ్మరని అన్నారు మంత్రి పేర్ని నాని. ఇన్నాళ్లూ పవన్ ను అజ్ఞాతవాసి అని…

తిరుపతి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ గట్టిగా ప్రతిస్పందించింది. ప్యాకేజీ తీసుకొని మాట్లాడే వ్యక్తి మాటల్ని తిరుపతి ప్రజలు నమ్మరని అన్నారు మంత్రి పేర్ని నాని. ఇన్నాళ్లూ పవన్ ను అజ్ఞాతవాసి అని మాత్రమే అనుకున్నానని, తిరుపతి సభలో ఆయన అజ్ఞానవాసి అనే విషయం తెలిసిందంటూ సెటైర్ వేశారు నాని.

“సినిమా షూటింగ్ అయింది. ఇక్కడ కాల్షీట్ ఇచ్చావు. ఒకటే మీటింగ్ 2 కాల్షీట్లు. ఇటు చంద్రబాబుకు, అటు బీజేపీకి కాల్షీట్. ప్రత్యేక విమానం ఎక్కావు, దిగావు, బల్ల ఎక్కావ్, జగన్ గారిని తిట్టావ్, వెళ్లిపోయావ్. కళ్లు మూసుకుపోయి మాట్లాడావు. 

ఎవడో ప్యాకేజీ ఇస్తే, ఇంకెవడో ఏదో రాసిస్తే అది మాట్లాడుతున్నావ్. సినిమాల్లో మాట్లాడితే తప్పులేదు. మేం కూడా వచ్చి చూసి ఈలలు వేస్తాం. నువ్వు ఇన్నాళ్లు అజ్ఞాతవాసివని మాత్రమే అనుకున్నాం. కానీ తిరుపతి మీటింగ్ తో అజ్ఞానవాసివని అర్థమైంది.”

రాజకీయాల్లో పవన్ నాయుడు అద్దె మైక్ లా తయారయ్యారని ఆరోపించారు పేర్ని నాని. ఎవరు అద్దెకు తెచ్చుకుంటే వాళ్ల గురించి మాట్లాడ్డం 2014 నుంచి అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. పాచిపోయిన లడ్డూలు తిని, పాచిపోయిన నోటితో మాట్లాడ్డం పవన్ కు బాగా అబ్బిందన్నారు.

“పవన్ నాయుడు ఓ అద్దె మైక్ లా తయారయ్యాడు. అద్దె మైక్ కు, పవన్ నాయుడుకు అస్సలు తేడా లేదు. ప్యాకేజీ దొరికితే మాట్లాడ్డమే పని. ఎన్నికలకు ముందు ఇదే పవన్ నాయుడు ఏమన్నాడు. ఉత్తరాది బీజేపీ వాళ్లు పాచిపోయిన లడ్లు ఇచ్చారు అన్నాడు. దక్షిణాది జనాలంటే మోడీకి చులకన అన్నారు. మరి ఇప్పుడు అవే పాచిపోయిన లడ్డూల్ని ఆబగా ఆవురుఆవురుమంటూ తినేస్తున్నావు.”

పవన్ నాయుడు అస్సలు నటుడే కాదని.. కేవలం చిరంజీవిని చూసి పవన్ ను ఆరాధిస్తున్నారని విమర్శించారు నాని. అయితే తెరపై కాకుండా.. రాజకీయాల్లో మాత్రం పవన్ నాయుడు అద్భుతంగా నటిస్తున్నారని, ఆయన నటనను కొట్టే రాజకీయనాయకుడు మరొకడు లేడని అన్నారు.