ఉప్పెన బ్యూటీకి బంపరాఫర్

ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ అనిపించుకుంది కృతి శెట్టి. ఆ సినిమా సెట్స్ పై ఉంటుండగానే నాని శ్యామ్ సింగరాయ్ మూవీలో ఆఫర్ దక్కించుకుంది. ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీలో ఛాన్స్…

ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ అనిపించుకుంది కృతి శెట్టి. ఆ సినిమా సెట్స్ పై ఉంటుండగానే నాని శ్యామ్ సింగరాయ్ మూవీలో ఆఫర్ దక్కించుకుంది. ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. 

లింగుసామి దర్శకత్వంలో రామ్ హీరోగా చేయబోయే సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్. ఇప్పుడీ అందగత్తె మరో బంపరాఫర్ కు అడుగు దూరంలో ఉంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబు సరసన నటించనుంది కృతి శెట్టి. ఈ మేరకు ప్రాధమికంగా చర్చలు మొదలయ్యాయి. సర్కారువారి పాట తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి షెట్టిని అనుకుంటున్నారు.

మహేష్ బాబు సరసన నటిస్తే కృతి షెట్టి టాప్ లీగ్ లోకి ఎంటరైపోయినట్టే. ఇప్పటికే ఆమె కెరీర్ ఉప్పెనలా  దూసుకుపోతోంది. ఇప్పుడు మహేష్ బాబు మూవీ కూడా ఓకే అయితే ఇక కృతి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

ప్రస్తుతం మహేష్ బాబు, సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈనెల 15వ తేదీ నుంచి హైదరాబాద్ లోనే కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నాడు. అటు అనీల్ రావిపూడి కూడా ఎఫ్3 సినిమా పనిమీద ఉన్నాడు.