Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ ఇద్దరితో నాగశౌర్య

ఆ ఇద్దరితో నాగశౌర్య

హీరో నాగశౌర్య మొత్తానికి రెండు సినిమాలు ఫైనల్ చేసాడు. రమణతేజ అనే కొత్త దర్శకుడితో స్వంత బ్యానర్ లో ఓ సినిమా ప్రారంభిస్తున్నాడు. అదే సమయంలో శరత్ మరార్ నిర్మాతగా, సంతోష్ జాగర్లపూడి (సుబ్రహ్మణ్యపురం)తో ఓ సినిమా చేయబోతున్నాడు.

సమంత బేబీలో ఓ కీలకపాత్ర పోషిస్తున్న నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ తో కూడా ఓ సినిమా చేయాల్సివుంది.  హీరోగా రెండు మూడు ప్రాజెక్టులు అనుకుని అటు ఇటు అయ్యాయి. భవ్యలో సినిమా అనుకున్నారు ఆగిపొయింది. సుకుమార్ అసిస్టెంట్, శరత్ మరార్ తో సినిమా అనుకున్నారు అది కూడా ఎందుకో ఆగింది.

ఆఖరికి ఆ రెండు సినిమాలకు బదులు ఈ రెండు సినిమాలు ఫైనల్ అయ్యాయి. స్వంత బ్యానర్ లో ఛలో సినిమా తరువాత నర్తనశాల సినిమా చేయడం శౌర్య కెరీర్ కు బ్రేక్ వేసింది. ఆ సినిమా ఆశించిన మేరకు ఫలితం సాధించకపోవడంతో, కెరీర్ అటు ఇటు అయింది. ఇప్పటికి కుదుటపడి మళ్లీ లైన్ లో పడినట్లు కనిపిస్తోంది.

నాగశౌర్యతో మెహరీన్

చాన్నాళ్ల క్రితం జూదగాడు సినిమాతో మాస్ జోనర్ ట్రయ్ చేసాడు హీరో నాగశౌర్య. మళ్లీ చాన్నాళ్ల తరువాత ఆ జోనర్ ను టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త డైరక్టర్ రమణ తేజ కాంబినేషన్ లో ఈ సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది.  స్వంత బ్యానర్ పై నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుందట. 

 

బాలకృష్ణ..ఎమ్మెల్యేగా గెలవాలంటే అదే జరిగుండాలి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?