‘ఆడవాళ్లు’ పై నాగవంశీ మాస్టర్ స్ట్రోక్?

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. మంచి బజ్ వచ్చిన సినిమా. శర్వానంద్..రష్మిక కాంబినేషన్. బోలెడు స్టార్ కాస్ట్. కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే రాదు అనుకున్న భీమ్లా…

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. మంచి బజ్ వచ్చిన సినిమా. శర్వానంద్..రష్మిక కాంబినేషన్. బోలెడు స్టార్ కాస్ట్. కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే రాదు అనుకున్న భీమ్లా నాయక్ సినిమా వస్తోంది. అయినా సరే ధైర్యం చేసి ఆడవాళ్లు…సినిమాను విడుదల చేయాలని నిర్మాత సుధాకర్ భావిస్తున్నారు.

కానీ భీమ్లా నాయక్ సినిమాకు సోలో విడుదల కావాలని నిర్మాత నాగవంశీ పట్టుదలగా వున్నారు. దానికి ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసారు. ఆడవాళ్లు సినిమా ఓవర్ సీస్, గుంటూరు, వెస్ట్, ఈస్ట్, ఆయనే బేరం చేసి తన మిత్రులతో కొనిపించారు. ఇప్పుడు బాల్ నాగవంశీ కోర్టులో వుంది.

నిర్మాత సుధాకర్ ధైర్యం చేసి 25న ఆడవాళ్లు సినిమాను విడుదల చేద్దాం అనుకున్నా, ఓవర్ సీస్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు బయ్యర్లు నో అంటారు. డబ్బులు కట్టలేం అంటారు. థియేటర్లు సెట్ చేయలేం అంటారు. కావాలంటే మీరే విడుదల చేసుకోండి అంటారు. దాంతో గత్యంతరం లేక ఆడవాళ్లు సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది.

హీరో శర్వానంద్ రణరంగం కారణంగా నిర్మాత నాగవంశీ ఎనిమిది కోట్లు నష్టపోయారు. అప్పటి నుంచి శర్వానంద్ కు ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు శర్వానంద్ సినిమాకు దెబ్బ తప్పడం లేదు.