ఈసారి ర‌జ‌నీకాంత్ అడ్డొచ్చాడు

మ‌రో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాకి క‌ష్టాలు త‌ప్పడం లేదు. సినిమా ఎప్పుడో పూర్తయినా ఇప్పటి వ‌ర‌కూ విడుద‌ల‌కు నోచుకోలేదు. ఇద్దర‌మ్మాయిలు వెళ్లాక ఈ సినిమా విడుద‌ల చేద్దామ‌నుకొన్నాడు. ఆ త‌ర‌వాత రామ్‌చ‌ర‌ణ్…

మ‌రో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాకి క‌ష్టాలు త‌ప్పడం లేదు. సినిమా ఎప్పుడో పూర్తయినా ఇప్పటి వ‌ర‌కూ విడుద‌ల‌కు నోచుకోలేదు. ఇద్దర‌మ్మాయిలు వెళ్లాక ఈ సినిమా విడుద‌ల చేద్దామ‌నుకొన్నాడు. ఆ త‌ర‌వాత రామ్‌చ‌ర‌ణ్ తుఫాన్ అడ్డొచ్చింది. అత్తారింటికి దారేది, ఎవ‌డు సినిమాలు అడ్డుప‌డ్డాయి. ఆ త‌ర‌వాత రేసుగుర్రం వెళ్లాక రేయ్ వ‌స్తుంద‌న్నారు. 

ఇప్పుడు కొత్త జంట విడుద‌లైన త‌ర‌వాత ముహూర్తం ఫిక్స్ చేశారు. మే 9న ఫైన‌ల్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఆ రోజు ర‌జ‌నీకాంత్ సినిమా విక్రమ‌సింహా అడ్డొస్తోంది. ఈ సినిమా కోసం రెండు నెల‌ల ముందు ఆంధ్రా లో థియేట‌ర్లు బ్లాక్ చేశారు. విక్రమ‌సింహా దెబ్బకు రేయ్‌ని థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్టంగా మారింది. అనుకొన్న సంఖ్యలో థియేట‌ర్లు ల‌భ్యంకాని ప‌రిస్థితి. 

అయితే వైవిఎస్ చౌద‌రి మాత్రం మా సినిమా ఈసారి పక్కా.. ఇది ఫిక్స్ అంటున్నాడు. అయితే ఇలాంటి మాట‌లు చాలాసార్లు వినీ వినీ విసిగిపోయింది మీడియా. ర‌జ‌నీకాంత్ దెబ్బకు పెద్ద పెద్ద సినిమాలే వెన‌క‌డుగు వేస్తుంటాయి. మ‌రి రేయ్ సినిమా ధైర్యం చేస్తుందా??  లేదంటే 9న కూడా తూచ్ చెబుతుందా??  అనేది మ‌రో వారంలో తెలిసిపోతుంది.