హీరోయిన్ వేట మళ్లీ మొదటికి

దిల్ రాజు నిర్మించే సినిమా కేరింతకు హీరోయిన్ వేట మళ్లీ మొదటికి వచ్చిందట. అడవి సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు ఇప్పటికి ముగ్గురు హీరోయిన్లను మార్చారు.  Advertisement ఆరంభంలో అవంతిక, మధ్యలో లావణ్య…

దిల్ రాజు నిర్మించే సినిమా కేరింతకు హీరోయిన్ వేట మళ్లీ మొదటికి వచ్చిందట. అడవి సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు ఇప్పటికి ముగ్గురు హీరోయిన్లను మార్చారు. 

ఆరంభంలో అవంతిక, మధ్యలో లావణ్య త్రిపాఠి వచ్చి చేరింది. అక్కడికీ దిల్ రాజో, సాయికిరణ్ నో లేక ఇద్దరూనో హ్యాపీ కాలేదు. దాంతో కృతిక (దృశ్యం) ను తీసుకున్నారు. ఆ అమ్మడు కూడా సూట్ కాలేదని ఫీలవుతున్నారట.

మళ్లీ హీరోయిన్  వేట మొదలైంది. ఈసారి నిర్మాత దర్శకులు చూపు శ్రీదివ్య మీద వుందట. బస్ స్టాప్, మల్లెల తీరం సినిమాల హీరోయిన్ ఈమె. తమిళ నాట బిజీగా వుంది. కానీ ఈ అమ్మాయినే మారుతి తను నానితో చేస్తున్న సినిమా కోసం తీసుకోవాలనుకుంటున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి.