నితిన్ నిర్మాతగా మరో సినిమా

హీరో నితిన్ ఇప్పటికే నిర్మాత అవతారం ఎత్తాడు. అక్కినేని అఖిల్ తో సినిమా ప్రారంభిస్తున్నాడు. అలాగే మరో సినిమా కూడా నిర్మించాలని సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఆ సినిమా లో హీరో మరెవరో కాదు విశాల్. …

హీరో నితిన్ ఇప్పటికే నిర్మాత అవతారం ఎత్తాడు. అక్కినేని అఖిల్ తో సినిమా ప్రారంభిస్తున్నాడు. అలాగే మరో సినిమా కూడా నిర్మించాలని సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఆ సినిమా లో హీరో మరెవరో కాదు విశాల్. 

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు విశాల్. ఇప్పుడు ఆ బ్యానర్, నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ట మూవీస్ కాంబినేషన్ లో సినిమా చేస్తారట. ఇది విశాల్ కు స్ట్రయిట్ తెలుగుసినిమా అవుతుంది.

పూజ అడియో ఫంక్షన్ లో శ్రేష్ఠ మూవీస్ విక్రమ్ గౌడ్ ఈ మేరకు ప్రతిపాదన చేసిన సంగతి గుర్తుండే వుంటుంది. అది ఇఫ్పటికి మెటీరియలైజ్ అయిందన్నమాట. విశాల్ తాజా సినిమా మగమహారాజు త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ముగ్గురు అత్తలతో ఈ సినిమాలో నటిస్తున్నాడు విశాల్. ఆ మధ్య విశాల్ నటించిన పూజ సినిమా తెలుగునాట బాగానే కలెక్షన్లు సంపాదించింది.