Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'జయమ్ము' కోసం ముంబాయ్ ఏజెన్సీ

'జయమ్ము' కోసం ముంబాయ్ ఏజెన్సీ

కమెడియన్ శ్రీనివాస రెడ్డి పూర్తి స్థాయి హీరోగా చేస్తున్న సినిమా జయమ్ము నిశ్చయమ్మురా. ఈ సినిమాను డిఫెరంట్ గా ప్రమోట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సినిమాను అవుట్ రేట్ గా నీలం కృష్ణారెడ్డి ఏడు కోట్లకు కొనేసుకున్నారు. ఆయన ధైర్యం ఏమిటంటే, సినిమా ఏమాత్రం సక్సెస్ అయినా రెండు నుంచి మూడు కోట్లు శాటిలైట్ రికవరీ వుంటుందని. పైగా ఇప్పటికే నైజాం భాద్యత సుధాకర్ రెడ్డి తీసుకున్నారు. 

ఇంత అమౌంట్ అని ఫిక్స్ కాకుండా,సినిమాకు వచ్చే హైప్, ఇతరత్రా వ్వవహారాలు చూసి, ఒకటిన్నర నుంచి రెండు కోట్ల బిజినెస్ జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల సినిమా హైప్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా వుండాలని, సినిమాను ప్రేక్షకులకు చేర్చడంలో ఎక్కడా తేడా రాకూడదని నిర్మాతలు డిసైడ్ అయ్యారట. 

అందుకోసం ముంబాయికి చెందిన ఒక సొల్యూషన్స్  ఏజెన్సీని పబ్లిసిటీ కోసం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?