Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ సినిమాకు కొరటాల మిత్రులు?

మహేష్ సినిమాకు కొరటాల మిత్రులు?

మహేష్ బాబు 27వ సినిమా ఎవరితో అన్నది ఇంకా సస్పెన్స్ గానే వుంది. డైరక్టర్ వంశీ పైడిపల్లితో అన్నది చాలావరకు క్లారిటీ వచ్చింది. అదే కనుక ఫిక్స్ అయితే 28వ సినిమాకు పరుశురామ్ డైరక్టర్ గా ఫిక్స్ అని అనుకోవాలి. ఎందుకుంటే పరుశురామ్ చెప్పిన లైన్ కు, స్క్రిప్ట్ కు మహేష్ బాబు దాదాపు ఓకె అన్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాను కొత్త నిర్మాతలు నిర్మించే అవకాశం వుందని బోగట్టా. కొరటాల శివ మిత్రులు కొందరు తొలిసారి నిర్మాణ రంగంలోకి దిగబోతున్నారు. వారే మహేష్-పరుశురామ్ కాంబినేషన్ సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది.

అందుకే, వారి కోసమే కొరటాల శివ స్వయంగా పరుశురామ్ ను మహేష్ దగ్గరకు తీసుకెళ్లి, కథ చెప్పించినట్లు తెలుస్తోంది. ఇదే పక్కా అయితే 2020 ద్వితీయార్థంలో ఈ సినిమా వుండే అవకాశం వుంది. అదే సమయంలో సుకుమార్ సినిమా మహేష్ తో 2020లో కూడా వుండదని ఫిక్స్ అయిపోవచ్చు.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?