ఎన్టీఆర్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు

పూరి జగన్నాథ్‌ అంటేనే ఎక్స్‌ప్రెస్‌ స్పీడ్‌తో తన సినిమాలు పూర్తి చేసేస్తుంటాడు. ఎంత పెద్ద స్టార్‌తో అయినా, ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్న సినిమానైనా కానీ ఎక్కువ రోజులు తీసుకోవడం పూరి జగన్నాథ్‌కి అలవాటు లేదు.…

పూరి జగన్నాథ్‌ అంటేనే ఎక్స్‌ప్రెస్‌ స్పీడ్‌తో తన సినిమాలు పూర్తి చేసేస్తుంటాడు. ఎంత పెద్ద స్టార్‌తో అయినా, ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్న సినిమానైనా కానీ ఎక్కువ రోజులు తీసుకోవడం పూరి జగన్నాథ్‌కి అలవాటు లేదు. ఒక డెడ్‌లైన్‌ పెట్టుకుని దానిని మీట్‌ అవ్వాలంటే పూరి జగన్నాథ్‌ తర్వాతే. ఎన్టీఆర్‌తో పూరి తీస్తున్న సినిమా షూటింగ్‌కి కొన్ని అంతరాయాలు ఏర్పడడంతో ఈసారి ఆన్‌ టైమ్‌కి రెడీ కాదేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అయితే పూరి జగన్నాథ్‌ మాత్రం ఎలాగైనా సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్‌ అయ్యి తీరాలని షూటింగ్‌ కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తున్నాడు. తన ఆఫీస్‌లోని ఎడిటింగ్‌ ఎక్విప్‌మెంట్‌ మొత్తం గోవాకి తీసుకెళ్లిపోయిన పూరి జగన్నాథ్‌ అక్కడే ఎడిటర్‌ ఎస్‌.ఆర్‌. శేఖర్‌తో లైవ్‌ ఎడిటింగ్‌ చేయిస్తున్నాడు. ఏ రోజు జరిగిన షూట్‌ ఆ రోజు ఎడిట్‌ అయిపోతోందన్నమాట. 

విశాఖపట్నంలో జరగాల్సిన షెడ్యూల్‌ హుద్‌హుద్‌ తుఫాన్‌ కారణంగా గోవాకి షిఫ్ట్‌ అయింది. గోవాలో షూటింగ్‌ జరుగుతున్నా కానీ సినిమాలో మాత్రం విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో తీసినట్టే చూపిస్తారట. ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.