Advertisement

Advertisement


Home > Movies - Movie News

ముందే జాగ్రత్తపడ్డ 30 ఇయర్స్ పృధ్వి

ముందే జాగ్రత్తపడ్డ 30 ఇయర్స్ పృధ్వి

తన సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవ్వడం 30 ఇయర్స్ పృధ్వికి కొత్తేంకాదు. పెద్ద హీరోల్ని అనుకరిస్తూ ఇతర సినిమాల్లో ఇతడు చేసే యాక్టింగ్ అభిమానుల ఆగ్రహానికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్వయంగా బాలయ్య, పృధ్వికి వార్నింగ్ ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ సినిమాకు ముందే జాగ్రత్తపడ్డాడు ఈ నటుడు.

ఆది హీరోగా నటించిన బుర్రకథ సినిమాలో ఓ కామెడీ పాత్ర పోషించాడు పృధ్వి. ఇందులో సాహో టీజర్ ను అనుకరించాడు. "ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్" అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ను పృధ్వితో చెప్పించారు. పనిలోపనిగా అరవింద సమేతలో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ ను కూడా ఇమిటేట్ చేశారు. సినిమా విడుదలకు ముందే దీనిపై వివరణ ఇచ్చుకున్నాడు పృధ్వి.

"డై హార్డ్ ఫ్యాన్స్ అనే డైలాగ్ ను దర్శకుడు సరదాగా పెట్టుకున్నాడు. కథలో నా క్యారెక్టర్ వేరేగా ఉంటుంది. టీజర్ లో డైలాగ్ చూసి ఏదేదో ఊహించుకోకండి. అలాంటిదేం కాదు. కథలో నాది ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇలాంటి విషయాల్ని ముందుగానే ఇలా లీక్ చేస్తేనే బెటర్"

ఇలా ముందుగానే వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు పృధ్వి. ప్రభాస్, ఎన్టీఆర్ ను కించపరిచేలా తమ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉండవని, ఇలాంటి విషయాల్లో రిలీజ్ కు ముందే అసలు విషయాన్ని లీక్ చేస్తే బెటరని అభిప్రాయపడ్డాడు పృధ్వి. సో.. ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి అతడికి వ్యతిరేకత రాకపోవచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంగతి అప్పుడే చెప్పలేం.

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?