దిల్ రాజు దగ్గరకు పుష్ప

రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలో కూడా శాశ్వత శతృవులు, మిత్రులు వుండరు. ఏస్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ దిల్ రాజు కు, టాప్ ప్రొడక్షన్ హవుస్ మైత్రీ మూవీస్ కు కొన్నాళ్ల క్రితం దూరం…

రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలో కూడా శాశ్వత శతృవులు, మిత్రులు వుండరు. ఏస్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ దిల్ రాజు కు, టాప్ ప్రొడక్షన్ హవుస్ మైత్రీ మూవీస్ కు కొన్నాళ్ల క్రితం దూరం పెరిగింది అని వార్తలు వచ్చాయి. 

ఉప్పెన నే లాస్ట్ సినిమా ఇకపై దిల్ రాజుకు మైత్రీ మూవీస్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ వుండదు అని పక్కాగా వినిపించింది. పుష్ప సినిమాను వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని అనుకున్నారు.

కానీ ఇప్పుడు మళ్లీ టేబుల్ టర్న్ అయింది. పుష్ప సినిమా డిస్కషన్లు దిల్ రాజుతో షురూ అయ్యాయి. నైజాం ఏరియాకు 45 కోట్ల మేరకు తమకు ఆఫర్ వుందని, కానీ కాస్త తగ్గించి అయినా మీకే ఇవ్వాలనుకుంటున్నామని దిల్ రాజుకు మైత్రీ మూవీస్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి ఇది చాలా భారీ రేటు. అల వైకుంఠపురం క్లోజింగ్ రేటు 45 కోట్లు. ఆ రేటును పుష్పకు కోట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప సినిమాను ఆంధ్ర ఏరియాకు 60 కోట్ల రేషియోలో మార్కెట్ చేసేసారు. నైజాం దిల్ రాజు దగ్గరకు బేరానికి వచ్చింది. 

ఇప్పటికే పుష్ప కు అటు ఇటు వున్న ఆర్ఆర్ఆర్, అఖండ, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ దిల్ రాజు దగ్గరే వున్నాయి. భీమ్లా నాయక్ ను 40 కోట్లకు, ఆర్ఆర్ఆర్ ను 70 కోట్లకు దిల్ రాజు నైజాం ఏరియాకు తీసుకున్నారని తెలుస్తోంది.