మెగా అభిమానుల‌కు చిర్రెత్తిస్తున్న బామ్మ‌ర్ది!

ఆహా…. డిజిట‌ల్ వేదిక‌గా అల్లు అర‌వింద్ చేప‌డుతున్న టాక్ షో మెగాస్టార్ అభిమానుల‌కు చిర్రెత్తిస్తోంది. అన్‌స్టాప‌బుల్ షో పేరుతో చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి నంద‌మూరి బాల‌కృష్ణ‌ను హోస్ట్‌గా ఎంచుకోవ‌డంపై ఇప్ప‌టికే మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు కోపంగా…

ఆహా…. డిజిట‌ల్ వేదిక‌గా అల్లు అర‌వింద్ చేప‌డుతున్న టాక్ షో మెగాస్టార్ అభిమానుల‌కు చిర్రెత్తిస్తోంది. అన్‌స్టాప‌బుల్ షో పేరుతో చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి నంద‌మూరి బాల‌కృష్ణ‌ను హోస్ట్‌గా ఎంచుకోవ‌డంపై ఇప్ప‌టికే మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు కోపంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇది చాల‌ద‌న్న‌ట్టు అన్‌స్టాప‌బుల్ షోకు ఫ‌స్ట్ గెస్ట్‌గా విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబును ఎంపిక చేశార‌నే వార్త‌లొస్తున్నాయి.

ఇదే జ‌రిగితే ముమ్మాటికీ మెగా కుటుంబ స‌భ్యుల‌తో పాటు వారి అభిమానుల మ‌న‌సుల్ని గాయ‌ప‌ర‌చ‌డానికే అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌ల “మా” ఎన్నిక‌ల సంద‌ర్భంగా టాలీవుడ్‌లో మెగా వ‌ర్సెస్ యాంటీ మెగా అనే ప్ర‌చారం జ‌రిగింది. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే మెగా కుటుంబం బ‌ల‌ప‌రిచిన ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ ఘోరంగా ఓడిపోయింది.

“మా” ఎన్నికల‌ సాకుతో మెగా కుటుంబంపై ప్ర‌త్య‌ర్థులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మెగా కుటుంబాన్ని ఎలాగైనా ఓడించాల‌ని ప్ర‌త్య‌ర్థులు క‌క్ష క‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డాన్ని చిరు, ప‌వ‌న్ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ప్ర‌కాశ్‌రాజ్ ప్రత్య‌ర్థి మంచు ప్యాన‌ల్‌కు నంద‌మూరి బాల‌కృష్ణ త‌దిత‌రులు పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

అంతెందుకు మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకారానికి చిరంజీవితో పాటు ఆయ‌న సోద‌రుల‌కు ఆహ్వానం అంద‌లేదు. పైగా ప్ర‌మాణ స్వీకార వేదిక‌పై నుంచి ప‌రోక్షంగా మెగా కుటుంబానికి విల‌క్ష‌ణ న‌టుడు తీవ్రహెచ్చ‌రిక‌లు చేయ‌డాన్ని వారి అభిమానులు జీర్ణించుకోలేకున్నారు.

మ‌న‌సుకు త‌గిలిన గాయా త‌డి ఇంకా ఆర‌క‌నే… న‌వంబ‌ర్ 4 నుంచి ప్ర‌సార‌మ‌య్యే అన‌స్టాప‌బుల్ షోకు నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో పాటు ఫ‌స్ట్ గెస్ట్‌గా మోహ‌న్‌బాబును ఎంపిక చేశార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

బాల‌య్య‌, మోహ‌న్‌బాబు క‌లిసి దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డంపై మెగా అభిమానులు మండిప‌డుతున్నారు. మెగా కుటుంబంపై అవాకులు చెవాకులు పేలిన వారిని ఆలింగం చేసుకుంటున్న అల్లు అర‌వింద్‌పై చిరు, ప‌వ‌న్ అభిమానులు కోపంగా ఉన్నార‌ని స‌మాచారం. చిరు బ్ర‌ద‌ర్స్‌ను విమ‌ర్శించిన వాళ్ల‌కు పెద్ద‌పీఠ వేయ‌డం వెనుక అల్లు ఉద్దేశం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వెల్లు వెత్తుతున్నాయి.