పగిలిపోద్ది.. అభిమానిపై నయనతార ఆగ్రహం

నిత్యం నవ్వులు చిందిస్తూ, గ్లామరస్ గా కనిపించే హీరోయిన్లు నిజజీవితంలో సీరియస్ అయితే ఎలా ఉంటుంది? ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. తాజాగా నయనతారను అభిమానులు ఈ కోణంలో చూడాల్సి వచ్చింది. తనను…

నిత్యం నవ్వులు చిందిస్తూ, గ్లామరస్ గా కనిపించే హీరోయిన్లు నిజజీవితంలో సీరియస్ అయితే ఎలా ఉంటుంది? ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. తాజాగా నయనతారను అభిమానులు ఈ కోణంలో చూడాల్సి వచ్చింది. తనను వీడియో తీయడానికి ప్రయత్నించిన ఓ అభిమానిపై నయన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

భర్త విఘ్నేష్ తో కలిసి తాజాగా మరికొన్ని ఆలయాల్ని సందర్శించింది నయనతార. ఇందులో భాగంగా కుంభకోణం సమీపంలోని మెళవత్తూర్ గ్రామంలోని కామాక్షి అమ్మవారి ఆలయానికి వీరిద్దరూ వచ్చారు. నయనతార వచ్చిందనే విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు.

అదే టైమ్ లో ఓ అభిమాని తన మొబైల్ కు పనిచెప్పాడు. ఆమెతో సెల్ఫీ వీడియో తీసే ప్రయత్నం చేశాడు. దాన్ని గమనించిన నయనతార అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “వీడియో తీస్తే ఫోన్ పగిలిపోద్ది” అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సదరు వీడియోతో పాటు, ఈ ఆడియో కూడా రికార్డ్ అయింది.

అక్కడితో ఆగలేదు నయన్ ఆగ్రహం. అమ్మవారి దర్శనం తర్వాత ఆమె బయటకురాగా, బయట కూడా అభిమానులు గుమిగూడారు. ఓ మహిళా అభిమాని, నయనతార వెనక వైపు నుంచి ఆమె భుజంపై చేయి వేసింది. వెంటనే నయనతారకు కోపం వచ్చేసింది. ఆమెపై కూడా సీరియస్ అయింది.