Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇంతలోనే మరో సినిమా స్టార్ట్ చేశాడు

ఇంతలోనే మరో సినిమా స్టార్ట్ చేశాడు

కెరీర్ లో వచ్చిన ఏడాది గ్యాప్ ను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భర్తీ చేయాలని నిర్ణయించాడు నితిన్. అందుకే వెంటనే మరో సినిమా స్టార్ట్ చేశాడు. కొన్ని రోజుల కిందట భీష్మ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన ఈ హీరో, ఈరోజు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు. 

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా కొత్త సినిమా ఈరోజు ప్రారంభమైంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనందప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. రకుల్ ప్రీత్, ప్రియాప్రకాష్ వారియర్ ఇందులో హీరోయిన్లుగా నటించబోతున్నారు. ప్రియా వారియర్ ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైంది. 

చంద్రశేఖర్ ఏలేటి గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా విభిన్నంగా ఉండబోతోంది. సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందనే విషయాన్ని నితిన్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు కీరవాణి సంగీతం అందించబోతున్నాడు. నితిన్-ఏలేటి కాంబోలో ఇదే తొలి చిత్రం.

భీష్మ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే, ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వస్తుంది. శ్రీనివాస కల్యాణం సినిమా తర్వాత నితిన్ కెరీర్ లో దాదాపు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ ను ఇలా 2 సినిమాలతో భర్తీ చేయాలని నితిన్ నిర్ణయించాడు. అంతేకాదు, ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉంటుండగానే తన సొంత బ్యానర్ పై కృష్ణచైతన్య దర్శకత్వంలో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?