Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్- త్రివిక్రమ్ ఒకే వేదిక పైకి?

ఎన్టీఆర్- త్రివిక్రమ్ ఒకే వేదిక పైకి?

చాలా కాలం అయింది దర్శకుడు త్రివిక్రమ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వేదిక మీదకు వచ్చి. ఇప్పుడు అలాంటి అవకాశం మరోసారి కనిపిస్తోంది. అరవింద సమేత సమయంలో త్రివిక్రమ్- ఎన్టీఆర్ ఒక వేదిక మీద భావావేశంతో మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి.

అల వైకుంఠపురములో తరువాత ఆ ఇద్దరు కలిసి సినిమా చేయాల్సి వుంది. కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. మంచి భారీ యాక్షన్ సినిమా అది అని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తరువాత త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ తో వేరే ప్రాజెక్ట్ మీదకు వెళ్లి, అది రకరకాలుగా మారి, గుంటూరు కారంగా బయటకు వచ్చింది. అది వేరే సంగతి.

ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్. త్రివిక్రమ్ సరైన హీరో డేట్ ల కోసం చూస్తున్నారు. బన్నీ తో సినిమా అన్నది వుండనే వుంది. మరి ఆ తరువాత ఎన్టీఆర్ తో వుంటుందా? తెలియాలి. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ చాలా అంటే చాలా భారీ పాన్ ఇండియా కథ రెడీ చేస్తున్నారని గతంలో ఇచ్చిన ఇంటర్వూల్లో నిర్మాత నాగవంశీ చెప్పారు. ఇప్పుడు అదే నాగవంశీ నిర్మించిన టిల్లు స్క్యేర్ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ హాజరవుతున్నారు.

ఎన్టీఆర్- హారిక సంస్థ నడుమ మంచి సంబంధాలు వున్నాయని ఈ పాయింట్ ప్రూవ్ చేస్తోంది. ఇక మిగిలింది త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ మెంట్..ఎప్పటికైనా. టిల్లు స్క్యేర్ సినిమాలో త్రివిక్రమ్ భార్య సౌజన్య కూడా భాగస్వామి. అందువల్ల ఈ సక్సెస్ మీట్ కు త్రివిక్రమ్ హాజరు కావాల్సి వుంటుంది. మామూలు సక్సెస్ మీట్ అయితే స్కిప్ చేయవచ్చు. కానీ ఎన్టీఆర్ వస్తున్నారు కనుక స్కిప్ అన్నది వుండకపోవచ్చు. అదే జరిగితే ఒకే వేదిక మీద ఎన్టీఆర్- త్రివిక్రమ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?