జాన‌క‌మ్మ ఆరోగ్యంపై దుష్ప్ర‌చారం…ఎస్పీ బాలు అస‌హ‌నం

ప్ర‌ముఖ గాయ‌ని ఎస్‌.జాన‌కి ఆరోగ్యంపై ఆదివారం రాత్రి సోష‌ల్ మీడియాలో నెగిటివ్ ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారంపై ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జాన‌కి ఆరోగ్యంపై జ‌రుగుతున్న దుష్ర్ప‌చారాన్ని కుటుంబ…

ప్ర‌ముఖ గాయ‌ని ఎస్‌.జాన‌కి ఆరోగ్యంపై ఆదివారం రాత్రి సోష‌ల్ మీడియాలో నెగిటివ్ ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారంపై ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జాన‌కి ఆరోగ్యంపై జ‌రుగుతున్న దుష్ర్ప‌చారాన్ని కుటుంబ స‌భ్యులు ఖండించారు.

జాన‌కి ఆరోగ్యంపై ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం స్పందిస్తూ సోష‌ల్ మీడియాపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఏంటీ చెత్త అంటూ విసుక్కున్నారు. క‌నీస విచ‌క్ష‌ణ లేకుండా కొంద‌రు నెటిజ‌న్లు ఇష్టానుసారం పోస్టింగ్‌లో పెడుతున్నార‌న్నారు. క‌ళాకారుల హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చార వార్త‌లు చూస్తే వారికి గుండె పోటు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

నెగిటివిటి వార్త‌ల వ‌ల్ల  ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే బాధ్యులు ఎవ‌ర‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను జాన‌క‌మ్మ‌తో మాట్లాడాన‌ని, ఆవిడ చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నార‌ని ఎస్పీ బాలు చెప్పుకొచ్చారు.  సోష‌ల్ మీడియాను మంచిప‌నుల కోసం వాడాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

జగన్ గారిని ఫాలో అవ్వక తప్పదు

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్