హీరోయిన్ పెళ్లి.. టాలీవుడ్ లో మొదలైన పిలుపులు

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లికి తనే స్వయంగా శుభలేఖలు పంచుతోంది. కోలీవుడ్, టాలీవుడ్ లో తన స్నేహితుల్ని తనే స్వయంగా వెళ్లి, కలిసి ఆహ్వానాలు అందిస్తోంది. Advertisement మొన్నటివరకు కోలీవుడ్ లో…

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లికి తనే స్వయంగా శుభలేఖలు పంచుతోంది. కోలీవుడ్, టాలీవుడ్ లో తన స్నేహితుల్ని తనే స్వయంగా వెళ్లి, కలిసి ఆహ్వానాలు అందిస్తోంది.

మొన్నటివరకు కోలీవుడ్ లో ఆమె పలువురు ప్రముఖులకు పెళ్లి శుభలేఖలు అందించింది. రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్.. ఇలా చాలామందిని ఆమె పెళ్లికి పిలిచింది. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తోంది.

టాలీవుడ్ లో తను వర్క్ చేసిన హీరోలు, నిర్మాతలు, దర్శకులకు పెళ్లి శుభలేఖలు అందిస్తోంది వరలక్ష్మి. పెళ్లి కార్డులు అందుకున్న ప్రముఖుల్లో తమన్, వంశీ పైడివల్లి, గోపీచంద్ మలినేని, ప్రశాంత్ వర్మ, హరీశ్ శంకర్, రవితేజ, అడివి శేష్, సమంత, నయనతార, సిద్దార్థ్ ఉన్నారు.

తమిళనాట రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందించేందుకు వరలక్ష్మితో పాటు శరత్ కుమార్, రాధిక కూడా వెళ్లారు. టాలీవుడ్ లో చంద్రబాబు, చిరంజీవి లాంటి కొంతమంది ప్రముఖుల్ని ఆహ్వానించేందుకు మాత్రం వీళ్లు ముగ్గురూ కలిసి వెళ్తున్నారు.

వచ్చే నెల 2న గ్యాలరిస్ట్ నికొలాయ్ సచ్ దేవ్ తో వరలక్ష్మి వివాహం జరగనుంది. వీళ్లిద్దరికీ ఆల్రెడీ నిశ్చితార్థం పూర్తయింది.