గంగ చంద్ర‌ముఖిగా మారిన‌ట్టుగా…!

ప్ర‌ధాని మోదీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్ఫూర్తితో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌రికొత్త రాజ‌కీయానికి తెర‌లేప‌నున్నారు. స‌నాత‌న ప‌రిర‌క్ష‌ణ పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌త‌ప‌ర‌మైన రాజ‌కీయాల‌కు ఆయ‌న తెర‌లేప‌నున్నారు. హిందూ స‌మాజాన్ని త‌న వైపు…

ప్ర‌ధాని మోదీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్ఫూర్తితో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌రికొత్త రాజ‌కీయానికి తెర‌లేప‌నున్నారు. స‌నాత‌న ప‌రిర‌క్ష‌ణ పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌త‌ప‌ర‌మైన రాజ‌కీయాల‌కు ఆయ‌న తెర‌లేప‌నున్నారు. హిందూ స‌మాజాన్ని త‌న వైపు తిప్పుకుని, త‌ద్వారా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందే ఎత్తుగ‌డ‌లో భాగంగా వారాహి డిక్ల‌రేష‌న్‌ను ప్ర‌క‌టించే సంకేతాలు వెలువడుతున్నాయి.

తాజాగా ఆయ‌న ఎక్స్‌లో పెట్టిన పోస్టు కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది. ఆ పోస్టు ఏంటంటే…

“ఇప్పుడు వారాహి చాలా పెద్ద ల‌క్ష్యం కోసం తిరిగి వ‌చ్చింది. స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ బోర్డుకు జీవం పోయాల‌ని అనుకునే ల‌క్ష‌లాది మంది స్వ‌రాన్ని ప్ర‌తిధ్వ‌నించ‌డ‌మే దాని ల‌క్ష్యం. మ‌న ప్రాచీన సంప్ర‌దాయాలు, విలువ‌ల‌ను ప‌రిర‌క్షించ‌డానికి సంబంధించింది. తిరుప‌తిలో వారాహి స‌భ ఈ నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌న‌కు నిలుస్తుంది. తిరుప‌తిలో నేను వారాహి డిక్ల‌రేష‌న్ చేయ‌బోతున్నా. స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తాన‌ని, మ‌న వార‌స‌త్వాన్ని కాపాడుకుంటాన‌ని, ఆ ల‌క్ష్యం క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రితో క‌లిసి న‌డుస్తాన‌ని వాగ్దానం చేస్తున్నా”

ప‌వ‌న్‌క‌ల్యాణ్ వాల‌కం చూస్తుంటే రాజ‌కీయ స‌న్యాసి అవ‌తారం ఎత్తి, వారాహి యాత్ర చేప‌డ‌తారేమో అనే అనుమానం క‌లుగుతోంది. గంగ చంద్ర‌ముఖిగా మారిన‌ట్టు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా స‌రికొత్త అవ‌తారం ఎత్త‌డానికి నిర్ణ‌యించుకున్నార‌నే అభిప్రాయం క‌లుగుతోంది. ఇందుకు తిరుప‌తి వేదిక కానుంది. త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ వారాహి స‌భలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెల్ల‌డించ‌నున్నారు.

మ‌తం అనే సున్నిత‌మైన సెంటిమెంట్‌తో త‌న ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్‌ను శాశ్వ‌తంగా దెబ్బ‌కొట్ట‌డానికి నిర్ణ‌యించుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. మ‌త‌త‌త్వ రాజ‌కీయాలే చేయబోతున్నారు. ఇందులో దాప‌రికం లేద‌ని ప‌వ‌న్ నేరుగా చెప్ప‌నున్నారు. స‌నాత‌న ప‌రిర‌క్ష‌ణ పేరుతో హిందూ స‌మాజాన్ని త‌న వైపు తిప్పుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం స‌ఫ‌లీకృతం అవుతాయో చూడాలి.

తిరుమ‌లో ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న చేతిలోని రెడ్‌బుక్‌పై అంద‌రి క‌ళ్లు ప‌డ్డాయి. ఆ పుస్త‌కం క‌వ‌ర్ పేజీపై ధ‌ర్మోర‌క్ష‌తి ర‌క్షితః అని రాసి వుంది. అలాగే వారాహి డిక్ల‌రేష‌న్‌, తిరుప‌తి అని రాసి ఉంది. తిరుప‌తిలో జ‌రిగే వారాహి స‌భ‌లో ఆ పుస్త‌కాన్ని తెర‌వ‌నున్నారు. అందులో ఏముందో తెలుసుకోడానికి అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

32 Replies to “గంగ చంద్ర‌ముఖిగా మారిన‌ట్టుగా…!”

  1. మిత్రమా…సనాతన ధర్మం వేరు..హిందూ మతం వేరు ఏది కావాలో ఎంచుకో..సనాతన ధర్మం అత్యంత కఠినమైనది.హిందుత్వం స్వేచ్ఛ విహాంగం..అర్థం చేసుకో!

  2. Good decision Pawan, 1. in temples only hindu employees, members 2. dress code to enter temple 3. contracts only to hindus 4. shops and surrounding business should be holy and should be to hindus 5. endowment lands and properties should be surrendered to sanathan bord to maintain..

  3. గంగ చంద్రముఖి గా మారినట్లు విశాఖ స్వామీజీ తో సరిగంగ స్నానాలు 2019 ఎన్నికల ముందు!

  4. మన అన్నయ్య ను డిక్లరేషన్ అడిగితే ఇవ్వకుండా సిగ్గులేకుండా దళితులు ,గుడి ,ఇదేమి హిందూయిజం అని పిచ్చి వాగుడు వాగితే నీకు బావుంది….అదే మన ధర్మాన్ని హేళన చెయ్యొద్దు, అన్ని మతాలను గౌరవిద్దాం అంటే బాధగా వుంది….అంతేనా GA…

  5. సనాతన ధర్మ పరిరక్షణ గురించి చెబితే చంద్రముఖిగా మారినట్లా? సిగ్గు పడాలి ఇలా పోల్చటానికి.

    సనాతన ధర్మం అనేది కేవలం ఒక పవన్ కళ్యాణ్ కో, బిజేపికో సంబంధించినది కాదు, దీని గురించి మాట్లాడటం మతతత్వ రాజకీయాలు కాదు. సనాతనధర్మ పరిరక్షణ నీది, నాది, మన అందరి బాధ్యత.

    1. భయ్యా, వీడు ఒక్కడేనా పోల్చేది నేను పోలుస్తాను. General గా Pen అనేది అందరూ వ్రాయటానికి వాడతారు వీడు మాత్రం పుట్టి లో పెట్టుకుంటాడు..

  6. రేణుదేశాయ్పి తో పిల్లల్ని పెళ్లి కాకుండానే కన్నాడు, అన్న lezenva తో కూడా అలానే చేసాడు, రేణుదేశాయ్ ఇంటర్వ్యూ లో చెప్పి ఏంతో కుమిలిపోయింది. ఇతను మనకి ఆదర్శమా? ఇంకా ఇలాంటివి ఎన్ని చేసాడో చేస్తున్నాడో పూనమ్ కౌర్ చేపిందిగా ? ఇదేనా ని సనాతన ధర్మం ఊరిమీద పడి కడుపులు చైయ్యటం ఏమన్నా అంటేన వ్యక్తి గతం అనటం, ఏంటిరా పావలా ఇతింగరి గాలి గబ్బు పనులు!! మనకుటుంభంలో ఇలానే చెబుదామా అమ్మ మీఇష్టం వచ్చిన వాళ్లతో తిరగండి పిల్లలు పుడితే అప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం అని? ఇదేనా పవన్ నేర్పించే సనాతన ధర్మమము ? సిగ్గుపడాలి ఇలాంటి

    ఓమనిషిని మనం నాయకుడుగా ఎంచుకోవడానికి? వాడికి సిగ్గుండాలి ఎలాంటివి కప్పిపుచ్చి ధర్మం గురించి మాట్లాడటానికి? పవన్ చేసింది గొప్పపనే ఐతే ప్రజారాజ్యం పెట్టేముందు రేణుదేశాయిని పెళ్ళిఎందుకు చేసుకున్నాడు, అన్న, జనం ఉస్తారనేకదే!!!

    తెలియట్లా ఇవన్నీ పనికిమాలిన కధలు అని!! ఏంటో నువ్వు చెప్పటం, జనం వినటం!!

  7. He already declared that he will make 1 MLA for YCP in 2029. For that ,he can even sacrifice 10 seats to sharmila in a grand alliance of TDP,JSP and sharmila party(Which is real YCP)

  8. Ga గాడు పెంట నేను జగన్ గాడి పెంట తింటాను గ్రేట్ ఆంధ్ర అని తీసెసి వైసిపి కి మాత్రం ఊడిగం చేస్తాను అని చెప్పుకోర పెంట కాదు జగన్ గాడి ది కూడా తింటావ్

  9. నీ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా కులాలను మతాలను రెచ్చ గొట్టి విడదీసి ఎన్నికల్లో గెలిచారు. అది మరచిపోయి నట్లువున్నావు. మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే విధంగా ఉంది ఈ ఆర్టికల్. మీ బాస్ గడచిన 5 సం.

    ఎంత విధ్వంసకార పరిపాలన చేసినాడో ప్రజలు మరచిపోలేదు. మీరు చెప్పే సోది యెవ్వడు వినేపరిస్థితి లో ప్రజలు లేరు సోదరా. జై హింద్ 🙏🙏🙏జై భారత్. 🙏🙏🙏.

    1. Only reason Jag won because of creating anti kama feeling(as TDP is perceived to be a Kama dominated or supported and Kamas are more prosperous due to over century of hard work on the farms) and luring of innocent dlth christins with Vijay beging with bible in hand.Other wise, he should never be a CM and Pawan want see that he get 1 MLA in 2029

  10. ఔను.. మనుషులు మారతారు.. వాల్మీకి ఒక బోయవాడి నించి గొప్ప ఋషి గా మారాడు..

  11. ఆంధ్రా లో మతం కంటే కులానికి ప్రాముఖ్యత….అందువల్ల హిందూ ఎజెండా పని చేయదు

Comments are closed.