వైసీపీకి ప్రాణం పోస్తున్న టీడీపీ!

కౌంటింగ్‌లో కూట‌మికి ఆధిక్యం క‌నిపించిన మొద‌లు… రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులపై దాడులు మొద‌ల‌య్యాయి. వైసీపీ నాయ‌కుల ఆస్తుల విధ్వంసంతో పాటు వారి వ్యాపార సంస్థ‌లను య‌థేచ్ఛ‌గా లాక్కోవ‌డం మొద‌లైంది.…

కౌంటింగ్‌లో కూట‌మికి ఆధిక్యం క‌నిపించిన మొద‌లు… రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులపై దాడులు మొద‌ల‌య్యాయి. వైసీపీ నాయ‌కుల ఆస్తుల విధ్వంసంతో పాటు వారి వ్యాపార సంస్థ‌లను య‌థేచ్ఛ‌గా లాక్కోవ‌డం మొద‌లైంది. కొన్ని చోట్ల వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల ప్రాణాల్ని కూడా తీశారు. రానున్న రోజుల్లో మ‌రిన్ని ప్రాణాలు పోవ‌చ్చు కూడా.

అయితే వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల ప్రాణాలు తీస్తూ టీడీపీ ఆనందాన్ని పొందుతూ వుండొచ్చు. ఇక్క‌డ అధికార పార్టీ నేత‌లు ప్ర‌ధానంగా గ్ర‌హించాల్సింది… వైసీపీకి రాజ‌కీయంగా ప్రాణం పోస్తున్నామ‌ని. వైసీపీ 11 అసెంబ్లీ సీట్ల‌కే ప‌రిమిత‌మై వుండొచ్చు. రాజ‌కీయాల్లో ఏదీ శాశ్వ‌తం కాద‌ని మ‌రీ ముఖ్యంగా టీడీపీ నేత‌లు గ్ర‌హించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా వుంది. ఎందుకంటే 2019లో ఇదే టీడీపీ కేవ‌లం 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్ల‌కు ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. నాడు వైసీపీ 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల‌ను గెలుచుకుని, ఇక త‌మ‌కు తిరుగులేద‌ని విర‌వీగింది.

ఐదేళ్లు తిరిగే స‌రికి రాజ‌కీయంగా త‌ల‌కిందులైంది. బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు అయిన చందంగా… వైసీపీ దారుణ ప‌రాజ‌యాన్ని మూట క‌ట్టుకుంది. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు రాష్ట్రం కోసం ప‌ని చేయ‌డం మానేసి, ప్ర‌తీకారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న అభిప్రాయాన్ని క‌లిగించ‌డంలో విజ‌యం సాధించారు. తాజాగా ఏపీలో ప‌రిణామాలు కూట‌మికి త‌ప్ప‌కుండా చెడ్డ‌పేరు తీసుకొచ్చేవే.

వైసీపీని ఎంత‌గా వేధిస్తే, టీడీపీకి అంత‌గా న‌ష్ట‌మ‌ని గ్ర‌హించే వ‌ర‌కూ రాష్ట్రంలో అవాంఛ‌నీయ ప‌రిణామాలు కొన‌సాగేలా ఉన్నాయి. ఎవ‌రెన్ని చెప్పినా ఈ ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. న‌ష్టం జ‌రిగితే త‌ప్ప క‌నువిప్పు కాదేమో!

11 Replies to “వైసీపీకి ప్రాణం పోస్తున్న టీడీపీ!”

  1. టిడిపి కాదు GA…. శవాలు….మీ పార్టీకి కావాల్సింది శవాలు మాత్రమే…మళ్ళీ మీ స్వార్థానికి వాళ్ళని వాడుకోవడం తప్ప వాళ్ళకి చేసేది సున్నా….

    1. అవును బ్రో నువ్వు చెప్పేది నిజమే. పేటీఎం బాచ్ శవ రాజకీయాలు చేస్తూ ఆ నెపాన్ని టీడీపీ పార్టీ మీదకు నెడుతున్నారు కానీ అంతిమంగా నష్టపోయేది వైసిపి పార్టీనే. ఇప్పటికే వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేల్లో కొంత మంది వేరే పార్టీల్లోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు అదే జరిగితే వైసీపీ పార్టీ తొందరలోనే కనుమరుగవడం ఖాయం

  2. మీ నాయకుడుకి శవాలు కావాలి అందుకే ఇద్దరి రౌడీ షీటర్ల గొడవకి రాజకీయ రంగు పులిమి పరామర్శించడానికి వెళ్ళాడు. పోనీ వెళ్ళేటప్పుడైనా విషాద వదనంతో వెళ్లాడా అంటే అదీలేదు ఇకిలుంచుకుంటూ వెళ్ళాడు. అసలు శవాలు చూస్తే ఈయనకు అంత ఆనందం ఎందుకు వస్తుంది. ఇంక ఈయనకి milage పెరుగుతుంది అని బిల్డప్ ఇస్తున్నావు

  3. ఇక్కడ వైసీపీ పార్టీకి టీడీపీ ప్రాణం పోస్తుందని నీ చెత్త రాతలు చదువుతుంటే రోత పుట్టిస్తున్నాయి గ్రేట్ ఆంధ్ర.

    వైసీపీ రౌడీ మూకలు వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేసుకుంటూ ఆ నెపాన్ని టీడీపీ పార్టీ మీదకు నెడుతున్నారు దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా సైకో జగన్ రెడ్డి. వాడి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది

    జగన్ అండ్ కో చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాన్ని జనం ఒక

    కంట గమనిస్తున్నారు. చివరగా ఒక మాట జగన్ రెడ్డి

    ఇలాంటి ఫేక్ ప్రచారం మీద పెట్టే దృష్టి పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలనే విషయం మీద దృష్టి పెడితే

    మంచిది లేదంటే తెలంగాణాలో కేసీఆర్ కి పట్టిన గతే

    ఇక్కడ జగన్ రెడ్డికి కూడా పడుతుంది

  4. వైసీపీ నేపథ్యం చెన్నారెడ్డి గారిని సీఎం పదవి దింపటానికి హైదరాబాద్ లో ఒవైసి తో కలసి అనేక మందిని చంపించిన చరిత్ర సానుభూతి కోసం బాబాయిని వేసేసిన చరిత్ర simpathy కోసం రంగ గారిని వేసేసి టీడీపీ మీద తోసేసిన చరిత్ర వున్నా పార్టీ తో తలపడాలి వాళ్లే అల్లరులు సృష్టించి ప్రభుత్వ వైఫల్యం అని దాంట్లో టీడీపీ పాత్ర ఉందని చెప్పే సమర్థులు ఇప్పుడు వీళ్లకు వున్న అల్లరి మేళం గంజాయి ని అమ్మేవారు ఎర్రచందనం దొంగలు వీళ్ళు మీద పోలీస్ లు ఉక్కు పాదం మోపడం తో ఉపాధి కోల్పోయి వున్నారు వీళ్ళను ఇప్పుడు వైసీపీ చక్కగా ఉపయోగించుకొంటుంది

  5. ఇలాంటి నీతులు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నపుడు జగన్ కి ఎందుకు చెప్పలేదు?

  6. జగనన్న తలుచుకుంటే …. రాష్ట్రమే రక్తసికం ….

    అదేకదా … ఐదేళ్లు వెలగబెట్టింది …

    జై జగన్ !

Comments are closed.