ష‌ర్మిల‌తో చిన్నాన్న‌ భేటీ వెనక ర‌హ‌స్యం ఏంటి?

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సోద‌రి, వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌తో చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఆక‌స్మికంగా భేటీ అయ్యారు. టీడీపీ చైర్మ‌న్ కూడా అయిన వైవీ త‌మ అధినేత జ‌గ‌న్ ఆదేశాలు లేకుండా ష‌ర్మిల‌ను…

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సోద‌రి, వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌తో చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఆక‌స్మికంగా భేటీ అయ్యారు. టీడీపీ చైర్మ‌న్ కూడా అయిన వైవీ త‌మ అధినేత జ‌గ‌న్ ఆదేశాలు లేకుండా ష‌ర్మిల‌ను క‌లిసే అవ‌కాశం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. 

ష‌ర్మిల‌కు వ‌రుస‌కు చిన్నాన్న అయ్యిన వైవీ సుబ్బారెడ్డి భేటీ వెన‌క ర‌హ‌స్యం ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ష‌ర్మిల తెలంగాణ‌లో ప్ర‌జాప్ర‌స్థానం పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. 

ఇది ఐదో రోజుకు చేరింది. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని నాగారం గ్రామంలో ష‌ర్మిల బ‌స చేసిన ప్రాంతానికి వైవీ వెళ్లి ఆమెతో సుమారు గంట‌సేపు చ‌ర్చ‌లు జ‌రిపారు. తెలంగాణ‌లో పార్టీ పెట్టాల‌నే ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని ష‌ర్మిల‌ను కోరిన‌ట్టు గ‌తంలో వైవీ సుబ్బారెడ్డి చెప్పిన సంగ‌తి తెలిసిందే.

త‌మ‌కు, ష‌ర్మిల పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న గ‌తంలో తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల‌తో వైవీ భేటీ వెన‌క కుటుంబ కారణాలా లేక రాజ‌కీయ ప‌ర‌మైన‌వా? అనే చ‌ర్చ‌కు దారి తీసింది. ఏది ఏమైనా షర్మిల‌తో వైవీ భేటీకి రాజ‌కీయ ప్రాధాన్యం ఏర్ప‌డింది.