మహిళలే టార్గెట్.. కారణం బయటపెట్టిన సైకో!

తెలంగాణలో సంచలనం సృష్టించిన సీరియల్ సైకో కిల్లర్ ను పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన తర్వాత అతడు సైకో కిల్లర్ అని పోలీసులకు తెలిసింది. అంతేకాదు, ఏకంగా…

తెలంగాణలో సంచలనం సృష్టించిన సీరియల్ సైకో కిల్లర్ ను పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన తర్వాత అతడు సైకో కిల్లర్ అని పోలీసులకు తెలిసింది. అంతేకాదు, ఏకంగా 18 మంది మహిళల్ని హత్య చేసిన విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఇంతకీ ఆ సైకో కిల్లర్ ఎందుకిలా చేశాడు? మహిళల్నే ఎందుకు టార్గెట్ చేశాడు?

అతడి పేరు రాములు. సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామం. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. జీవిత అనుభవాలే ఇతడ్ని సైకో కిల్లర్ గా మార్చేశాయి. పెళ్లయిన 2 వారాలకే ఇతడి భార్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు కాపురం చేసిన తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె వేరు కాపురం పెట్టుకుంది.

ఆ తర్వాత మరో మహిళతో సహజీవనం ప్రారంభించాడు. అయితే ఆమె మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని రాములుకు అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను హత్య చేశాడు రాములు. అప్పట్నుంచి ఇతడి హత్యల పరంపర మొదలైంది. భర్తలు ఉండి, తప్పుడు మార్గంలో వెళ్తున్న మహిళల్ని గుర్తించి హత్య చేయడం మొదలుపెట్టాడు. దీనికోసం అతడు కల్లు కాంపౌండ్లను ఎంచుకున్నాడు.

మహిళలతో పరిచయం పెంచుకొని వాళ్ల వివరాలు తెలుసుకుంటాడు. భర్త ఉండి, అడ్డదారి తొక్కుతోందని తెలిస్తే మాత్రం ఉన్మాదిగా మారిపోతాడు. వాళ్లను అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపేస్తుంటాడు. అలా ఇప్పటివరకు 18 మందిని హత్య చేశాడు రాములు.

నిజానికి ఇతడ్ని 2009లోనే అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పటికి ఇతడు 9 హత్యలు చేశాడు. కోర్టు జీవిత ఖైదు కూడా విధించింది. అయితే పిచ్చి పట్టినట్టు నాటకం ఆడి ఎర్రగడ్డ హాస్పిటల్ లో చేరాడు. అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. తిరిగి హత్యలు చేయడం మొదలుపెట్టాడు.

2013లో మరోసారి పోలీసులకు దొరికినప్పటికీ, జీవిత ఖైదు కేసును హైకోర్టులో సవాల్ చేశాడు. మిగిలిన కేసులపై బెయిల్ పొంది బయటకొట్టాడు. ఇప్పుడు మరోసారి వెంకటమ్మ అనే మహిళను హత్య చేసి పోలీసులకు చిక్కాడు. ఈ హత్యలతో పాటు పలు చోరీ కేసులు కూడా ఇతడిపై ఉన్నాయి.

గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్‌, మెగా పవర్‌ స్టార్‌

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?