తెలంగాణ కాంగ్రెసు పార్టీకి కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులైన సంగతి తెలిసిందే కదా. ఆమె సింప్లిసిటీ అంటే నిరాడంబరత గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె విమానంలో కాకుండా రైలులో హైదరాబాదుకు వచ్చారు. ప్రభుత్వ అతిథి గృహంలోనే బస చేశారు. నాయకులను, కార్యకర్తలు స్టేషన్కు వచ్చి తనకు ఘన స్వాగతం పలకవద్దని, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టవద్దని, నినాదాలు చేయవద్దని ఆదేశించారు. ఆమె చెప్పిన ప్రకారమే జరిగింది.
ఆమె మొదటిసారి రావడం కాబట్టి పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కొద్దిగా గట్టిగానే మాట్లాడారు. హెచ్చరికలు చేశారు. ప్యారాచూట్ నేతలకు అంటే ఫిరాయింపుదారులకు పదవులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఈ మాటతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసు పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు కాంగ్రెసులో పదవులపై ఆశలు గల్లంతైనట్లే. ఇప్పటివరకు అంతో ఇంతో ఆశలు ఉన్నట్లయితే వాటిని తుడిచి పెట్టేయాల్సిందే.
కానీ, కాంగ్రెసు పార్టీలో సీఎం రేవంత్ రెడ్డే ఫిరాయింపుదారుడు కదా. ఆయన టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెసు పార్టీలో చేరాడు. ఇప్పుడు ఉన్న మంత్రుల కంటే రేవంత్ రెడ్డి చాలా జూనియర్. కాని ఆయన వల్లనే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిందని అధిష్టానం ప్రధానంగా రాహుల్ గాంధీ విశ్వసించాడు. అందుకే సీఎం అయ్యాడు.
మంత్రి సీతక్క, సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి ఇంకా కొందరు టీడీపీ నుంచి వచ్చినవాళ్లే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి అయారామ్ గయారామ్లు కొందరు ఉన్నారు. కాని కాంగ్రెసులోనే పుట్టి పెరిగిన కొందరికి పదవులు రావడంలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అదే ప్రశ్నించాడు. పార్టీలో 30 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న కుసుమ్ కుమార్కు ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
కష్టపడి పనిచేసినవారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, అలాంటివారికే పదవులు ఇస్తామని మీనాక్షి నటరాజన్ చెప్పారు. ఇదంతా చెప్పడంవరకు బాగానే ఉంటుందికాని ఆచరణలో జరగదు. పదవులు దక్కకపోతే అధిష్టానాన్ని ధిక్కరించడానికి చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారు.
Emito mana l 1 1 party black yevaru chusaru
Manaku yendhuku sir