విశాఖలో ఎఎఎ కు పూజ‌

అల్లు అర్జున్- ఆసియన్ సినిమాస్ కాంబినేషన్ లో హైదరాబాద్ లో నిర్మాణమైన మల్టీ ఎఎఎ. మళ్లీ అదే ఎఎఎ ఇప్పుడు విశాఖలో కూడా రాబోతోంది. ఏడాది నుంచి చర్చలు, అగ్రిమెంట్ దశలో వుందీ వ్యవహారం.…

అల్లు అర్జున్- ఆసియన్ సినిమాస్ కాంబినేషన్ లో హైదరాబాద్ లో నిర్మాణమైన మల్టీ ఎఎఎ. మళ్లీ అదే ఎఎఎ ఇప్పుడు విశాఖలో కూడా రాబోతోంది. ఏడాది నుంచి చర్చలు, అగ్రిమెంట్ దశలో వుందీ వ్యవహారం. అన్ని అగ్రిమెంట్లు పూర్తయి కూడా మంచి ముహుర్తాలు లేక, అలా వుండిపోయింది. ఇప్పుడు శ్రావణమాసం వస్తుండడంతో పూజా కార్యక్రమం నిర్వహించి, పనులు మొదులుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆసియన్ సునీల్ నారంగ్, అల్లు అర్జున్ భాగస్వామ్యంలో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మాణం జ‌రుగుతుంది. విశాఖలో ప్రతిష్టాత్మక ఇనార్బిట్ మాల్ నిర్మాణం మొదలై చాలా కాలమైంది. ఇందులోనే ఈ మల్టీప్లెక్స్ వస్తుంది. ఆరు లేదా ఏడు స్క్రీన్ లు వుండేలా ప్లాన్ చేస్తున్నారు. చాలా విలాసవంతంగా, అందంగా వుండేలా ఇంటీరియర్ డిజైన్ ను ప్లాన్ చేస్తున్నారు.

పూజా కార్యక్రమం హడావుడి లేకుండా నిర్వహించేసి, నిర్మాణం ప్రారంభిస్తారు. ఇప్పటికే విశాఖలో మూడు మూడు మల్టీ ప్లెక్స్ లు వున్నాయి. అలాగే గాజువాకలో కూడా వున్నాయి. ఈ మధ్య ఉత్తరాంధ్ర అంతా సినిమా కలెక్షన్లు పెరగడానికి కారణం మూడు జిల్లాల్లో మంచి స్క్రీన్ లు ఎక్కువగా రావడమే. ఇప్పుడు ఈ ఎఎఎ తో మరి కొన్ని స్క్రీన్ లు యాడ్ అవుతాయి.

4 Replies to “విశాఖలో ఎఎఎ కు పూజ‌”

Comments are closed.