తీర్పు తేడా కొడితే గులాబీదళం ఖాళీయేనా?

తెలంగాణ హైకోర్టు సోమవారం వెలువరించబోయే తీర్పు కోసం రాజకీయ వర్గాలు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై…

తెలంగాణ హైకోర్టు సోమవారం వెలువరించబోయే తీర్పు కోసం రాజకీయ వర్గాలు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా స్పీకరును ఆదేశించాలని కోరుతూ ఉత్తర్వులివ్వాలని భారాస హైకోర్టులో పిటిషను వేసింది.

సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించనుంది. హైకోర్టు తీర్పుతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుందని.. గులాబీ నాయకులు చాలా కాలంగా ఎంతో కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. త్వరలోనే తెలంగాణలో మూడు స్థానాలకు ఉప ఎన్నిక వస్తుందని కూడా వారు అంటున్నారు. అయితే ఇవాళ హైకోర్టు తీర్పు భారాస ఆశిస్తున్నట్టుగా కాకుండా తేడా కొడితే పరిస్థితి ఏమిటి? అనే చర్చ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

భారాస నుంచి కాంగ్రెసులో చేరిన ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారు. కానీ ఈ ముగ్గురి మీద మాత్రం ప్రస్తుతం హైకోర్టులో కేసులు ఉన్నాయి. వీరిలో దానం నాగేందర్ భారాస తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీచేయడం కూడా జరిగింది. ఇలాంటి ఆధారాలతో భారాస హైకోర్టులో గట్టిగానే పోరాడుతోంది.

సాధారణంగా ఇలాంటి ఫిరాయింపు కేసుల్లో స్పీకరు అధికారాల్లోకి తాము జోక్యం చేసుకోలేం అనే తీర్పులు వస్తుంటాయి. భారాస వారికి కూడా ఆ భయం కొంత లేకపోలేదు. హైకోర్టులో తేడా కొడితే.. సుప్రీం కోర్టులో అయినా మళ్లీ అప్పీలు చేసుకోవడానికి వారు సిద్ధంగానే ఉన్నారు.

కవిత బెయిలు కోసం కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో తిష్టవేసిన రోజుల్లో.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల గురించి కూడా అక్కడి సుప్రీం న్యాయవాదులతో మాట్లాడినట్లు వారే చెప్పారు. హైకోర్టులో మిస్సయినా సరే.. సుప్రీం ద్వారా వారిపై వేటు వేయించి ఉప ఎన్నిక తీసుకువస్తాం అని అన్నారు. కానీ.. ప్రస్తుతానికి సోమవారం హైకోర్టు తీర్పు వెలువడబోతోంది. ఈ తీర్పు ఏమాత్రం తేడాగా వచ్చినా.. భారత రాష్ట్ర సమితి నుంచి మరింత మంది నాయకులు కాంగ్రెసులోకి వలసలు వెళ్లవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.

గులాబీ ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెసుతో టచ్ లో ఉన్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.ఈ ముగ్గురిపై వేటు వేసేలా హైకోర్టు తీర్పు ఇవ్వకపోతే వారందరికీ ధైర్యం వస్తుంది. ఇక వలసలు హోరెత్తుతాయని పలువురు భావిస్తున్నారు.

8 Replies to “తీర్పు తేడా కొడితే గులాబీదళం ఖాళీయేనా?”

  1. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీ

    శాలువా కప్పి ప్రభుత్వంలోకి తీసుకుని తమ బలాన్ని

    కేసీఆర్ ప్రభుత్వం పెంచుకుంది అప్పుడు అది కేసీఆర్

    గారికి తప్పుగా అనిపించలేదా. అంటే కేసీఆర్ కూడా

    ఫిరాయింపులకు పాల్పడినట్లు భావించాలి కదా

    1. అసలు మొదలు పెట్టిందే వాళ్ళు… అసలు ఎంత దారుణం అంటే అప్పటి దాక ఎవరైనా ఎంఎల్ఏ చనిపోతే వాళ్ళింటి వాళ్ళను నిలబెట్టి మిగతా పార్టీ లు ఎవరూ పోటీకి దిగి వారు కాదు… Kachara గాండు మాత్రం ఆ సాంప్రదాయానికి తెరేసాడు… ఇప్పుడు మాత్రం లాస్యం నందిత ను మాత్రం గెలిపించాలని అంటూ ఏవో కబుర్లు చెప్పాడు

  2. నాలుగు వారాల్లో చర్య తీసుకోమని లేకపోతే మేము విచారణ కి స్వీకరిస్తాం అని ఇవాళ కోర్ట్ చెప్పింది.

  3. మా బాబోరు ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకుంటేనే ఏమి చెయ్యలేకపోయింది కోర్టు … ఆఫ్టరాల్ వేరే పార్టీ తరుపున పోటీచేస్తే ఏమవుతుందిఈ … మా విజనరీ అంటే ఏమనుకున్నారు.. ఇటువంటి సవాలక్ష ద రి ద్రాలకు మూలకారకుడు

Comments are closed.