వంగ‌వీటి రాధాకు అస్వ‌స్థ‌త‌

టీడీపీ నాయ‌కుడు వంగ‌వీటి రాధా స్వ‌ల్ప గుండెపోటుకు గుర‌య్యారు. దీంతో ఆయ‌న్ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విజ‌య‌వాడ‌లో ఉంటున్న రాధాకు బుధవారం అర్ధ‌రాత్రి అనారోగ్యానికి గుర‌య్యారు. గుండె నొప్పిస్తోంద‌ని కుటుంబ స‌భ్యుల‌కు ఆయ‌న…

టీడీపీ నాయ‌కుడు వంగ‌వీటి రాధా స్వ‌ల్ప గుండెపోటుకు గుర‌య్యారు. దీంతో ఆయ‌న్ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విజ‌య‌వాడ‌లో ఉంటున్న రాధాకు బుధవారం అర్ధ‌రాత్రి అనారోగ్యానికి గుర‌య్యారు. గుండె నొప్పిస్తోంద‌ని కుటుంబ స‌భ్యుల‌కు ఆయ‌న చెప్పార‌ని స‌మాచారం. దీంతో ఆల‌స్యంగా చేయ‌కుండా వెంట‌నే ఆయ‌న్ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌తో గుండె నొప్పి వ‌చ్చిన‌ట్టు కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతానికి ప్రాణాపాయం లేద‌ని వైద్యులు వెల్ల‌డించార‌ని రాధా స‌న్నిహితులు తెలిపారు. అయితే 48 గంట‌లు వైద్యుల ప‌ర్య‌వేక్షణ‌లో వుండాల‌ని చెప్పిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ఇదిలా వుండ‌గా వంగ‌వీటి రాధా రాజ‌కీయంగా యాక్టీవ్‌గా లేరు. టీడీపీలో వంగ‌వీటి రాధా ఉన్న‌ప్ప‌టికీ, ఆ పార్టీ కార్య‌క‌లాపాల్లో పాల్గొంటున్న దాఖ‌లాలు లేవు. జ‌న‌సేన నాయ‌కులతో వంగ‌వీటి రాధా స‌న్నిహితంగా మెలుగుతుంటారు. అలాగే వైసీపీ నాయ‌కులు వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నానితో కూడా బాగుంటారు. ఆయ‌న తీరుపై ఏ పార్టీలోనూ మంచి అభిప్రాయం లేదు. నిల‌క‌డ‌లేని త‌నంతో రాజ‌కీయంగా ఎద‌గ‌లేక‌పోయార‌నే విమ‌ర్శ‌లున్నాయి. వంగ‌వీటి రాధా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుందాం.

7 Replies to “వంగ‌వీటి రాధాకు అస్వ‌స్థ‌త‌”

  1. అస్వస్థత అన్నపుడు అంత వరకే కదా రాయాలి ..దాంట్లో రాజకీయం పులమడం ఎందుకు రా బోస్ డి కే

Comments are closed.