చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలిః జ‌గ‌న్‌

ల‌డ్డూ ప్ర‌సాదంపై క‌ల్తీ ఆరోప‌ణ‌ల్ని నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు క‌మిటీ వేసిన నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. సుప్రీంకోర్టు కామెంట్స్‌ను చూస్తే, చంద్ర‌బాబు త‌ప్పు చేశార‌ని రుజువవ‌వుతోంద‌న్నారు. క‌లియుగ దైవం వేంక‌టేశ్వ‌ర‌స్వామి…

ల‌డ్డూ ప్ర‌సాదంపై క‌ల్తీ ఆరోప‌ణ‌ల్ని నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు క‌మిటీ వేసిన నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. సుప్రీంకోర్టు కామెంట్స్‌ను చూస్తే, చంద్ర‌బాబు త‌ప్పు చేశార‌ని రుజువవ‌వుతోంద‌న్నారు. క‌లియుగ దైవం వేంక‌టేశ్వ‌ర‌స్వామి విష‌యంలో ఎవ‌రైనా ఆడుకుంటే మామూలుగా వుండ‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. తెలిసి తెలిసి ఆ స్వామి ఆడుకుంటున్నార‌ని చంద్ర‌బాబు, కూట‌మి నేత‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సుప్రీంకోర్టులో 30వ తేదీన ప‌రిణామాల్ని కూడా మీరంతా గ‌మ‌నించే వుంటారన్నారు. ఇవాళ మ‌రోసారి సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు ఇచ్చిందని జ‌గ‌న్ తెలిపారు. సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న ప‌రిణామాల్ని గ‌మ‌నిస్తే చంద్ర‌బాబు నిజ‌స్వ‌రూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందన్నారు. మ‌త విశ్వాసాల‌ను రాజ‌కీయ కార‌ణాల‌తో ఎలా రెచ్చ‌గొడుతున్నారో స‌ర్వోన్న‌త న్యాయ స్థానం గ‌మ‌నించ‌డం వ‌ల్లే ఘాటు వ్యాఖ్య‌లు చేసిందన్నారు.

దేవుడిని రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని సుప్రీం చెప్పింద‌న్నారు. చంద్ర‌బాబు స్వ‌యంగా వేసుకున్న సిట్‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింద‌న్నారు. నిజంగా తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను, ప్ర‌సాదం విశిష్ట‌త‌ను రాజ‌కీయ దుర్భుద్ధితో జంతువుల కొవ్వును వాడి త‌యారు చేసిన‌ట్టుగా, తిన్న‌ట్టుగా అస‌త్య ప్ర‌చారాల్ని చంద్ర‌బాబు చేశార‌న్నారు. త‌ద్వారా తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను అప‌విత్రం చేశార‌ని వాపోయారు. వీట‌న్నింటికి సంబంధించి సాక్ష్యాధారాల‌ను తాను చూపించాన‌ని , అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా మొట్టికాయ‌లు వేసింద‌న్నారు.

కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా చంద్ర‌బాబు దెబ్బ‌తీశార‌ని జ‌గ‌న్ అన్నారు. బాబు నియ‌మించుకున్న ఈవో, సీఎం మాట‌ల‌కు విరుద్ధంగా ఎలా ప్ర‌క‌ట‌న‌లు చేశారో గ‌మ‌నించిన‌ట్టైతే, మంచి వ్య‌క్తి అయిన‌ట్టైతే కొద్దోగొప్పో సిగ్గుప‌డేవార‌న్నారు. ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్న‌ప్పుడు, దేవుడంటే ఎవ‌రిలోనైనా భ‌య‌మో, భ‌క్తో వుంటే ప‌శ్చాత్తపం క‌ల‌గాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. బాబుకు దేవుడంటే భ‌యం, భ‌క్తి లేవ‌న్నారు.

సాక్ష్యాత్తు టీడీపీ అధికారిక ట్విట‌ర్‌లో … మీ పాపం పండింది జ‌గ‌న్ అంటూ పోస్టు పెట్టార‌న్నారు. ఇప్ప‌టికీ దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ధ‌ర్మారెడ్డిని త‌న‌కు బావ అని రాయ‌డంపై జ‌గ‌న్ మండిప‌డ్డారు. దారుణ వ‌క్రీక‌ర‌ణ చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబుకు సుప్రీంకోర్టు ఎలా అక్షింత‌లు వేసిందో నేష‌న‌ల్ మీడియా చూపింద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ టీడీపీ సోష‌ల్ మీడియాలో త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఇంత‌కంటే సీఎం దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌నం ఏముంటుంద‌ని ఆయ‌న ప్రశ్నించారు.

నిజాలు ఒప్పుకోడానికి చంద్ర‌బాబుకు మ‌న‌సు రావ‌డం లేద‌న్నారు. టీటీడీకి స‌ర‌ఫ‌రా చేసే నెయ్యిలో క్వాలిటీ లేక‌పోతే లోప‌ల‌కి పంపే ప్ర‌శ్నే ఉండ‌ద‌న్నారు. టీటీడీలో క్వాలిటీని టెస్ట్ చేసే గొప్ప వ్య‌వ‌స్థ వుంద‌న్నారు. మూడు ద‌ఫాలు నెయ్యి ట్యాంక‌ర్ల‌ను టెస్ట్ చేస్తార‌ని, అందులో పాస్ అయితేనే లోప‌లికి అనుమ‌తి ఇస్తార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. జూలై 6, 12 తేదీల్లో టీటీడీకి వ‌చ్చిన నెయ్యి ట్యాంక‌ర్లు టెస్ట్‌లో పాస్ కాక‌పోవ‌డంతో వెన‌క్కి పంపార‌న్నారు.

జూలై 23న ఎన్‌డీడీబీ శాంపిల్స్ వ‌చ్చిన త‌ర్వాత టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు మాట్లాడుతూ ఆ ట్యాంక‌ర్ల‌ను వెన‌క్కి పంపార‌ని, అందుకు సంబంధించిన వీడియోను జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించారు. అయిన‌ప్ప‌టికీ త‌న వంద రోజుల పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా, త‌న పాల‌న విఫ‌లం కావ‌డంతో టాపిక్‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికి సెప్టెంబ‌ర్ 18న తిరుమ‌ల ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు వాడార‌ని ఆరోపించార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

టీటీడీ ఈవో మాత్రం ట్యాంక‌ర్ల‌ను వెన‌క్కి పంపామ‌ని అంటుంటే, రెండు నెల‌ల త‌ర్వాత చంద్ర‌బాబు మాత్రం అందుకు విరుద్ధంగా ఏకంగా దేవుని ప్ర‌తిష్ట‌ను, ల‌డ్డూ ప్ర‌సాదం విశిష్ట‌త‌ను అప‌విత్రం చేశార‌ని జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు స్వ‌యంగా నియ‌మించుకున్న టీటీడీ ఈవో మ‌ళ్లీ సెప్టెంబ‌ర్ 20న సీఎం చెప్పిన మాట‌లు అబ‌ద్ధ‌మ‌ని రుజువు చేసేలా, ట్యాంక‌ర్ల‌ను వెన‌క్కి పంపిన‌ట్టు నేష‌న‌ల్ మీడియాకు చెప్పార‌న్నారు.

అయిన‌ప్ప‌టికీ సెప్టెంబ‌ర్ 22న చంద్ర‌బాబు తాను అబ‌ద్ధాలే చెబుతాన‌ని, రాజ‌కీయ ఉద్దేశాలే ముఖ్య‌మ‌ని, తిరుమ‌ల దేవుడైనా, ల‌డ్డూ అయినా లెక్క‌లేద‌న్న‌ట్టు అబ‌ద్ధాలే చెప్పార‌న్నారు. అబ‌ద్ధాల‌కు రెక్క‌లు క‌ట్టి, గోబెల్స్ ప్ర‌చారంతో మ‌న ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అప‌విత్రం చేస్తూ, కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఎలా వ్య‌వ‌హ‌రించారో ఇదే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఈ విష‌య‌మై బాబుకు మొట్టికాయ‌లు వేయాల‌ని ప్ర‌ధానికి లేఖ రాశామ‌న్నారు.

అలాగే సుప్రీంకోర్టును ఆశ్ర‌యించామ‌ని జ‌గ‌న్ అన్నారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు బాబును త‌ప్పు ప‌ట్టార‌న్నారు. ఆ నెయ్యి వాడ‌లేద‌ని స్వ‌యంగా ఈవో చెప్పారు క‌దా? మ‌రి ముఖ్య‌మంత్రి క‌ల్తీ అయ్యింద‌ని ఎలా చెబుతార‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింద‌న్నారు. ఆధారాలు లేక‌పోయినా రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి మీడియాతో ఎలా మాట్లాడ్తార‌ని కోర్టు ప్ర‌శ్నించ‌డాన్ని ఆయ‌న గుర్తు చేశారు. సీఎం ప్ర‌క‌ట‌న‌కు పూర్తి విరుద్ధంగా ఈవో ప్ర‌క‌ట‌న వుంద‌ని న్యాయ స్థానం చెప్పింద‌న్నారు.

సుప్రీంకోర్టు ఐదుగురు క‌మిటీతో ద‌ర్యాప్తు చేయాల‌ని ఆదేశించింద‌న్నారు. వీరిలో ఏపీకి చెందిన ఇద్ద‌రు అధికారులు వుంటార‌ని సుప్రీం చెప్పింద‌న్నారు. ఇంత‌గా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే, దేవుడంటే బాబుకు భ‌యం, భ‌క్తి ఉన్నా, చంద్ర‌బాబు మొట్ట‌మొద‌ట క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరారు. త‌ప్పు చేశాన‌ని, క్ష‌మించాల‌ని తిరుమ‌ల‌లో చంద్ర‌బాబు వేడుకోవాల‌ని డిమాండ్ చేశారు. వాస్త‌వాలు ఇవైతే, తాను త‌ప్పు చేసిన‌ట్టు టీడీపీ సోషల్ మీడియా దుష్ప్ర‌చారం చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు.

దేవుని స‌మ‌క్షంలో దోషులుగా ఎవ‌రు నిల‌బ‌డాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌న ఖ‌ర్మ ఏంటంటే… చంద్ర‌బాబుకు దేవుడంటే భ‌యం, భ‌క్తి లేవ‌న్నారు. మ‌న రాష్ట్రానికి ఇలాంటి ముఖ్య‌మంత్రి ఉండ‌డం ఖ‌ర్మ అన్నారు. బాబు చేసిన పాపం, రాష్ట్రంపై ప‌డ‌కూడ‌ద‌ని దేవుని కోరుకుంటున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. కూట‌మి వ‌ర‌కే దేవుడు వేసే శిక్ష ప‌రిమితం కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు జ‌గ‌న్ తెలిపారు.

వెంక‌టేశ్వ‌ర‌స్వామే అన్నీ న‌డిపిస్తార‌న్నారు. అన్యాయం చేసే చంద్ర‌బాబు లాంటి వాళ్ల గురించి వెంక‌టేశ్వ‌ర‌స్వామే చూసుకుంటార‌ని ఆయ‌న చెప్పారు. అస‌లు స‌నాత‌న ధ‌ర్మం గురించి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తెలుసా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు త‌ప్పుడు చేశాడ‌ని క‌ళ్లెదుటే క‌నిపిస్తుంటే, వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌సాదం విశిష్ట‌త‌ను త‌గ్గిస్తూ, కోట్లాది మంది భ‌క్తుల మ‌న‌సుల్లో అనుమానం క‌లిగించేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు, అందులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా భాగ‌మే అన్నారు. దుష్ప్ర‌చారం చేసేలా ప‌వ‌న్ అడుగులు ముందుకేస్తున్న‌ప్పుడు, స‌నాత‌న ధ‌ర్మ‌మ‌ని మాట్లాడ్డం న్యాయ‌మా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. త‌ప్పును గుడ్డిగా స‌మ‌ర్థిస్తుంటే, అది కూడా దేవుని విష‌యంలో దుష్ప్ర‌చారం చేయ‌డం స‌రైందా? అని జ‌గ‌న్ నిల‌దీశారు.

23 Replies to “చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలిః జ‌గ‌న్‌”

  1. వీడు మరీ ఇంత స న్నాసి ఏంటి జిఏ

    మళ్ళీ వీడిని మోస్తూ నువ్వు ఆర్టికల్స్ రాయటం

    సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇద్దరు రాష్ట్ర అధికారులతో పాటు సిబిఐ వాళ్ళు ఇద్దరూ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒకరితో కమిటీ వేసింది

    దానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి అని సి గ్గు లేకుండా ఎలా వాగుతున్నాడు ఎ ద వ

    ఎందుకు ఈ ఎదవ 43 కోట్ల రూపాయలతో ఫర్నిచర్ దొంగతనం చేసినందుకా చంద్ర బాబు నాయుడు క్షమాపణ చెప్పాలి?

  2. దొంగ పనులు చేసిందేమో ఈ దొంగ వెధవ మళ్ళీ వీడికి సిబిఎన్ క్షమాపణ చెప్పాలంట మరి సిగ్గు శరం ఏమీ లేవు రా మొత్తం వదిలేసినట్లు ఉన్నావు JA LA GAAA

  3. దొం గ పనులు చేసిందేమో ఈ దొం గ వె ధ వ మళ్ళీ వీడికి సిబిఎన్ క్షమాపణ చెప్పాలంట మరి సి గ్గు శరం ఏమీ లేవు రా మొత్తం వదిలేసినట్లు ఉన్నావు JA LA GAAA

  4. దొం గ పనులు చేసిందేమో ఈ దొం గ వె ధ వ మళ్ళీ వీడికి సిబిఎన్ క్షమాపణ చెప్పాలంట మరి సి గ్గు శరం ఏమీ లేవు రా మొత్తం వదిలేసినట్లు ఉన్నావు JA LA G A A A

  5. దొం గ పనులు చేసిందేమో ఈ దొం గ వె ధ వ మళ్ళీ వీడికి సి బి ఎన్ క్షమాపణ చెప్పాలంట మరి సి గ్గు శరం ఏమీ లేవు రా మొత్తం వదిలేసినట్లు ఉన్నావు J A L A G A A A

  6. దొం గ పనులు చేసిందేమో ఈ దొం గ వె ధ వ మళ్ళీ వీడికి సి బి ఎన్ క్షమాపణ చెప్పాలంట మరి సి గ్గు శ రం ఏమీ లేవు రా మొత్తం వదిలేసినట్లు ఉన్నావు J A -L A- G A A A

  7. వీడే తీర్పు చెప్పాడు, ఇంక సుప్రీం సిట్ కూడా అక్కర్లేదు అన్నమాట.

  8. అంతా బాగానే manage చేశావ్ గాని…మన అన్నయ్య , cbi enquiry అధికారులు కూడా తప్పుడు report ఇస్తారని ఆందోళనతో చెప్పిన మాటలు లేపేసావ్ ఏంటి GA….😂😂😂

  9. Correct…. CBN క్షమాపణ చెప్పాలి…ఎవరికి? వేంకటేశ్వర స్వామి కి, అది వాళ్లు చెప్పేశారు కూడా….

    ఇకపోతే, మన 1st class student కి కోర్టు తీర్పు చదవడం రాడు..పోనీ కనీసం ఎవరూ తనకి అర్థం అయ్యే భాషలో చెప్పరు (మన ఖర్మ వీడికి ఏ భాషలో చెప్పిన అర్థం కాదు)

    SC కూడా SIT వేసింది కానీ అందులో అఫీషియల్స్ CBI kooda ఉన్నారు…CBN కూడా దానినే సమర్థించాడు

    ఎలాగూ నిజం బయటకి వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో

  10. అక్కడ లడ్డూ తీసేసి వివేకం బాబాయ్ అని పెట్టి చదవండి….2019 election ముందు బాబాయ్ శవం సాక్షిగా మన అన్నయ్య చెప్పిన డైలాగ్స్ అన్ని మ్యాచ్ అవుతాయి….😂😂

  11. వెంకటేశ్వరస్వామి తో ఆడుకున్నది ఎవ్వరు, నీవు కాదా జన్మతః నీవు క్రిస్టియన్ వి అటువంటి నీవు ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువుల ఓట్లు కోసం గుడికి వెళ్ళావు. అయిదు సంవత్సరాలు ఆయన మోసం చేసినందుకు నిన్ను శిక్షించాలిగా

  12. మూడు రాజధానుల మీద కావచ్చు గత ప్రభుత్వం నిర్ణయం ల మీద కావచ్చు వచ్చిన తీర్పు లు వేయించుకున్న మొట్టికాయలు లకి మన అన్న ఎం చెయ్యాలి…

Comments are closed.