ఓహో… రాజ‌కీయం కోస‌మేనా కుమార్తెకు ప‌వ‌న్ డిక్ల‌రేష‌న్‌!

రాజ‌కీయం కోస‌మే తిరుమ‌ల‌లో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ డిక్ల‌రేష‌న్‌ నాట‌కం ఆడార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. రాజ‌కీయం కోసం కాక‌పోతే, ఇవాళ విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను కూడా ఇద్ద‌రు కుమార్తెల‌తో క‌లిసి ప‌వ‌న్ ద‌ర్శించుకునే వారంటున్నారు.…

రాజ‌కీయం కోస‌మే తిరుమ‌ల‌లో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ డిక్ల‌రేష‌న్‌ నాట‌కం ఆడార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. రాజ‌కీయం కోసం కాక‌పోతే, ఇవాళ విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను కూడా ఇద్ద‌రు కుమార్తెల‌తో క‌లిసి ప‌వ‌న్ ద‌ర్శించుకునే వారంటున్నారు. క‌న‌క దుర్గ‌మ్మ వారికి ద‌స‌రా ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించే సంగ‌తి తెలిసిందే.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న కుమార్తె ఆద్య‌తో క‌లిసి వెళ్లారు. కానీ క్రిస్టియానిటీని స్వీక‌రించిన మ‌రో కుమార్తె పొలీనా అంజ‌ని కొణిదెల లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. విజ‌య‌వాడ క‌న‌క దుర్గ‌మ్మ వారి ఆల‌యంలో అన్య‌మ‌త‌స్తులు డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌నే నిబంధ‌న లేదు. దీంతో త‌న కుమార్తె పొలీనాను తీసుకెళ్లినా ఎలాంటి ప్ర‌చారం రాద‌నే ఉద్దేశంతోనే వెంట తీసుకెళ్ల‌లేద‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. తిరుమ‌ల‌లో జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సిందే అని ప్ర‌త్య‌ర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. డిక్ల‌రేష‌న్‌పై జ‌గ‌న్ సంత‌కం అడుగుతామ‌ని టీటీడీ అధికారులు ముందే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యింది.

ఆ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న ఇద్ద‌రు కుమార్తెల‌తో తిరుమ‌ల‌కు వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న కుమార్తెతో డిక్లరేష‌న్‌పై సంత‌కం చేయించి, త‌ద్వారా జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేసే ఎత్తుగ‌డ‌లో భాగంగానే ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా న‌డుచుకున్న‌ట్టు చెబుతున్నారు. విజ‌య‌వాడ‌లో క‌న‌క దుర్గ‌మ్మ ఆల‌యంలో డిక్ల‌రేష‌న్ తంతు లేక‌పోవ‌డంతో కుమార్తె పొలీనా అంజ‌ని కొణిదెలను తీసుకెళ్ల‌లేద‌ని తాజాగా విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

25 Replies to “ఓహో… రాజ‌కీయం కోస‌మేనా కుమార్తెకు ప‌వ‌న్ డిక్ల‌రేష‌న్‌!”

  1. అంతే కానీ పద్ధతులు ఫాలో అయ్యాడు అని మాత్రం రాయవు, తా చెడ్డ కోతి వనమంత చెరిచిందట, ఇక్కడ వీడి విశ్వ ప్రయత్నం ఏమి చెప్పడానికి!!??

  2. అసలు గ్రేట్ ఆంధ్రా నీ సమస్య ఏమిటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతుర్లను ఏ గుడికి తీసుకు వెళ్లాలో ఆయన ఇష్టం, మధ్యలో నీ బాధేమిటి

  3. మరి అదే వైసీపీ వారిని అడగాల్సింది…రాజకీయం కోసమేనా జగన్ తిరుపతి యాత్రలు, స్వామిజి దర్శనాలు, నదిలో మునకలు అని. రాజకేయం కాకపోతే …ఇంటిదెగ్గర సెట్టింగ్ లో కనపడే సిమెంట్ వదిన, తిరుపతి లో కనపడడు ఎందుకో

  4. ఇది రాసిన వాళ్ళకి జనరల్ నాలెడ్జ్అ సలు లేనట్టుంది , ఎలా ఎలా రాయాలో కూడా తెలియని వాళ్లు అయి ఉండాలి

    విషయం రాస్తే అవగాహనతో రాయాలి అప్పుడే దానికి విలువ ఉంటుంది

  5. ఎన్ని సార్లు ఎంత సేపు ఏడ్చిన ఉపయోగం లేదు GA… మన అన్నయ్య కి అహంకారం తో కళ్ళు మూసుకుపోయి దేవుడి కన్నా నేనే గొప్ప అనే భ్రమలో చేసిన తప్పుకు…. PAWAN KALYAN family మీద ఏడిస్తే ఏం లాభం GA….ఆలోచించు…

  6. రాజకీయం కోసం కాకపోతే ynot తిరుమల కి వెళ్ళ్తాను అన్నాడో .. డిక్లరేషన్ అనగానే పారిపోయింది .ఎందుకో మరి .. .

  7. INC లో విలీనం దిశగా YCP 2026 లో వచ్చే జమిలి ఎన్నికలు అయినా 2029 లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు అయినా ఏ పొత్తు లేకుండ జగన్మోహన్ రెడ్డి INC MLA అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం అయ్యా రెడ్డి కాంగ్రెస్, కొడుకు YCP

    సోర్స్ – sakshi

  8. కాంగ్రెస్ లో విలీనం దిశగా వై చీపి

    2026 లో వచ్చే జమిలి ఎన్నికలు అయినా

    2029 లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు అయినా

    ఏ పొత్తు లేకుండ జగన్ కాంగ్రెస్ మ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం

    అయ్యా రె డ్డి కాంగ్రెస్, కొడుకు వై చీపి

    సోర్స్ – సాక్షి న్యూస్

  9. కాంగ్రెస్ లో విలీనం దిశగా వై చీపి

    2026 లో వచ్చే జమిలి ఎన్నికలు అయినా

    2029 లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు అయినా

    ఏ పొత్తు లేకుండ జ గ న్ కాంగ్రెస్ మ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం

    అయ్యా రె డ్డి కాంగ్రెస్, కొడుకు వై చీపి

    సోర్స్ – సా క్షి న్యూస్

Comments are closed.