రాజకీయాల్లోకి వచ్చి అన్నీ అమ్ముకున్నాను అని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను రాజకీయాల్లోకి రాకూడదు అనుకున్నానని ఆనాడు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వల్లనే ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశాను అని అన్నారు. తరువాత వైసీపీలో చేరి రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అన్నారు.
తన సొంత ఆసులు అరవై ఎకరాల భూమి తాను పోగొట్టుకున్నానని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి సంపాదించినది లేదని పోయినదే చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.
ఇపుడు తన మీద విమర్శలు చేస్తున్నారని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఒక్క విషయంలో తాను అక్రమాలు చేసినట్లుగా నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
తన జీవితం జనసేనలో బాగుందని రాజకీయంగా వైభోగం చూస్తున్నాను అని ఆయన అంటున్నారు. అయితే ఉన్న ఆస్తులు అమ్ముకుని సాధారణ జీవితం సాగిస్తున్న తన మీద ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించాలని ఆయన కోరారు.
తన మీద చేసిన ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటాను అని వంశీ క్రిష్ణ అంటున్నారు.
politics for earning or serving people?
not sure, why he lost properties
Insane .w r yu. .politics is full costly .without giving money public are not voting . For each MLA ticket it’s around 30 to 35 vrores
Exactly that was the point, they openly agreeing buying votes, why no legal action?
అయ్యో! డాక్యుమెంట్ మీద పేర్లు ఎవరి పేరు మీద మార్చారు మరి?
Sir is purified after joining janasena….

దీనికి నువ్వేమంటావు గ్యాస్ ఆంధ్ర ?