వాయిదా వేసింది కాకుండా మళ్లీ కౌంట్ డౌన్ కూడానా!

తమ హీరో సినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కోరుకుంటారు ఫ్యాన్స్. అలా అప్ డేట్ ఇవ్వని నిర్మాణ సంస్థల్ని, దర్శకుల్ని బండబూతులు తిడుతుంటారు. పాపం, ఆదిపురుష్ దర్శకుడు కూడా ఇలానే అనుకున్నాడు. ప్రభాస్…

తమ హీరో సినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కోరుకుంటారు ఫ్యాన్స్. అలా అప్ డేట్ ఇవ్వని నిర్మాణ సంస్థల్ని, దర్శకుల్ని బండబూతులు తిడుతుంటారు. పాపం, ఆదిపురుష్ దర్శకుడు కూడా ఇలానే అనుకున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆనందపరచడం కోసం ఓ అప్ డేట్ వేశాడు. కట్ చేస్తే, అది అతడికి రివర్స్ లో తగిలింది. భారీ ట్రోలింగ్ కు కారణమైంది.

రామాయణ ఇతిహాసం నేపథ్యంగా ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఓ అప్ డేట్ ఇచ్చాడు. అదే సినిమా రిలీజ్ కౌంట్ డౌన్. ఆదిపురుష్ విడుదలకు ఇంకా 150 రోజులు మాత్రమే టైమ్ ఉందంటూ నిన్న పోస్ట్ పెట్టాడు రౌత్.

ఈ హ్యాష్ ట్యాగ్ ను ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తారని అతడు భావించాడు. అయితే అది కాస్తా రివర్స్ అయింది. రౌత్ పోస్ట్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. దీనికి కారణం సినిమా విడుదల లేట్ అవ్వడమే.

లెక్కప్రకారం, ఈ సినిమా ఈ పాటికి థియేటర్లలోకి రావాలి. సంక్రాంతి బరిలో ముందుగా బెర్త్ కన్ ఫర్మ్ చేసిన సినిమా ఇదే. కానీ అంతలోనే సంక్రాంతి బరి నుంచి ఆదిపురుష్ ను తప్పించారు. సంక్రాంతి లాంటి మంచి సీజన్ ను తమ హీరో మిస్ చేసుకున్నాడనే బాధ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉంది.

మొన్నటికిమొన్న చిరంజీవి, బాలయ్య సినిమాలు రిలీజ్ అయిన టైమ్ లో కూడా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ గురించే మాట్లాడుకున్నారు. రొటీన్ కంటెంట్ తో వచ్చిన ఈ రెండు సినిమాల మధ్య ఆదిపురుష్ వచ్చి ఉంటే, ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యేదని వాళ్ల ఫీలింగ్.

ఇలాంటి టైమ్ లో “ఇంకా 150 రోజులు మాత్రమే” అంటూ ఓంరౌత్ పెట్టిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ రగిలిపోయారు. సినిమా వాయిదా వేసింది కాకుండా, తగుదునమ్మా అంటూ ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తావా అనేది ప్రభాస్ ఫ్యాన్స్ కంప్లయింట్. పైగా అది 100 రోజుల కౌంట్ డౌన్ కూడా కాదు. ఏకంగా 150 రోజల ముందు కౌంట్ డౌన్.

దీంతో ఓ రేంజ్ లో ఓం రౌత్ పై విరుచుకుపడ్డారు ఫ్యాన్స్. ముందు ప్లానింగ్ నేర్చుకో, తర్వాత పోస్ట్ పెట్టు అంటూ తిట్ల దండకం అందుకున్నారు. జూన్ 16న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.