బీజేపీ ఎంపీ జీవీఎల్‌ను త‌న్నింది

గుంటూరులోని మిర్చి ఎగుమ‌తిదారుల అసోసియేష‌న్ కార్యాల‌య ప్రారంభానికి వెళ్లిన బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావుకు వింత అనుభ‌వం ఎదురైంది. గోమాత‌తో రెండుసార్లు ఆయ‌న కాలు త‌న్నులు తినాల్సి వ‌చ్చింది. ఇందుకు సంబంధించి వీడియో…

గుంటూరులోని మిర్చి ఎగుమ‌తిదారుల అసోసియేష‌న్ కార్యాల‌య ప్రారంభానికి వెళ్లిన బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావుకు వింత అనుభ‌వం ఎదురైంది. గోమాత‌తో రెండుసార్లు ఆయ‌న కాలు త‌న్నులు తినాల్సి వ‌చ్చింది. ఇందుకు సంబంధించి వీడియో మీడియాలో వైర‌ల్ అవుతోంది.

బీజేపీ నేత‌లు గోమాత‌కు సేవ‌కు ప్రాధాన్యం ఇచ్చే సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో గుంటూరుకు వెళ్లిన రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ గోశాల‌ను సంద‌ర్శించారు. గోమాత‌కు పూజ చేసేందుకు ఆయ‌న‌కు ప్ర‌య‌త్నించారు. గోమాత కాలితో ఆయ‌న్ని త‌న్నింది. దీంతో ఆయ‌న కాస్త స‌ర్దుకుని మ‌ళ్లీ గోమాతకు ద‌ణ్ణం పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. అప్పుడు కూడా త‌న్నింది. దీంతో ఆయ‌న మ‌రోసారి ఆ ప్ర‌య‌త్నాన్ని చేయ‌కుండా విర‌మించుకున్నారు.

దూరం నుంచే గోమాత‌కు ద‌ణ్ణం పెట్టుకుని వెళ్లిపోయారు. గోమాత చుట్టూ ప‌ది మంది గుమి కూడ‌డంతో భ‌య‌ప‌డి అలా ప్ర‌వ‌ర్తించింద‌ని గోశాల నిర్వాహ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండ‌డాన్ని గ్ర‌హించొచ్చు. 

జీవీఎల్ అంటే గిట్ట‌ని వారు ఆయ‌న‌పై సెటైర్లు విసురుతున్నారు. ముఖ్యంగా టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు జీవీఎల్‌పై స‌ర‌దా కామెంట్స్ చేస్తున్నారు.