రెరా ముద్ర ఉన్నదే ‘రియల్‌’ ఎస్టేట్‌

 ఏ బిల్డరైనా, ప్రమోటరైనా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ వద్ద రిజిస్టర్‌ కాకుండా ఫ్లాట్‌లు, ప్లాట్లు, భవనాలు లేదా ఏ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ను విక్రయించడానికి వీల్లేదని గృహ నిర్మాణశాఖ సహాయ మంత్రి హర్దీప్‌…

 ఏ బిల్డరైనా, ప్రమోటరైనా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ వద్ద రిజిస్టర్‌ కాకుండా ఫ్లాట్‌లు, ప్లాట్లు, భవనాలు లేదా ఏ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ను విక్రయించడానికి వీల్లేదని గృహ నిర్మాణశాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి బుధవారం రాజ్యసభలో స్పష్టంచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ రియల్‌ ఎస్టేట్‌ చట్టం 2016 ప్రకారం రెరా వద్ద రిజిస్టర్‌ చేసుకోకుండా ఏ బిల్డరు లేదా ప్రమోటరు తమ వెంచర్లను ప్రచారం చేసుకోవడం, బుక్‌ చేయడం, విక్రయించడం వంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోను అనుమతించబడవని మంత్రి తెలిపారు.

రెరా చట్టం అమలులోకి వచ్చిన నాటికే నిర్మాణంలో ఉండి ప్రాజెక్ట్‌ పూర్తయినట్లుగా జారీచేసే ధృవీకరణ పత్రం పొందని బిల్డర్లు మూడు మాసాల వ్యవధిలో తమ ప్రాజెక్ట్‌ను రెరా వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి దరఖాస్తు చేయాల్సి ఉందని అన్నారు. రెరా వద్ద రిజిస్టర్‌ చేసుకోని బిల్డర్లు, ప్రమోటర్లు రెరా ఆదేశాలు, మార్గదర్శకాలను అతిక్రమిస్తే అలాంటి వారికి రెరా చట్టంలోని సెక్షన్‌ 59 కింద 3 ఏళ్ళ జైలుశిక్ష లేదా ప్రాజెక్ట్‌ అంచనా వ్యయంలో పదిశాతం జరిమానా విధించే నిబంధన ఉన్నట్లు ఆయన చెప్పారు.

రెరా వద్ద రిజిస్టర్‌ కాని బిల్డర్ల వద్ద ఫ్లాట్లు కొన్న వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తగిన ఫోరం వద్ద ఫిర్యాదు చేసి చట్టపరంగా తమ హక్కులను పరిరక్షించుకోవచ్చని మంత్రి చెప్పారు. దేశంలో ఎన్ని గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లు రెరా వద్ద రిజిస్టరయ్యోయో వివరాలు తమ మంత్రిత్వశాఖ సేకరిందని మంత్రి చెప్పారు. రెరా వ్యవస్థను ప్రతి రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఆ వివరాలన్నీ ఆయా రాష్ట్ర రెరా వద్దే లభ్యమవుతాయని తెలిపారు.

వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఊపందుకున్న కార్గో రవాణా
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కార్గో రవాణా గణనీయంగా పెరిగినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి బుధవారం రాజ్య సభలో ప్రకటించారు. వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2017-18లో 257 మెట్రిక్‌ టన్నుల సరుకులు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ నుంచి రవాణా కాగా 2018-19 నాటికి అది 669 మెట్రిక్‌ టన్నులకు చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో హ్యాండ్లింగ్‌ కాంప్లెక్స్‌ ఏడాదికి 20 వేల మెట్రిక్‌ టన్నుల రవాణా సామర్ధ్యం కలిగి ఉంది.

ఎయిర్‌ కార్గో రవాణా కార్యకలాపాలాను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలకు వీలు కల్పిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌ లైన్స్‌ సర్వీసులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. 2017లో విశాఖపట్నంలో అంతర్జాతీయ ఎయిర్‌ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ టెర్మినల్‌ కార్యనిర్వహణ, యాజమాన్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌కు అప్పగించడం జరిగింది. 558 చదరవు మీటర్ల ఏరియాలో ఉన్న ఈ టెర్మినల్‌లో కార్గో రవాణా నిమిత్తం లోడింగ్‌, అన్‌లోడింక్‌ కోసం ట్రక్‌ డాక్‌ ఏరియా, తనిఖీలు చేపట్టే హాలు, స్ట్రాంగ్‌ రూమ్‌, కోల్డ్‌ స్టోరేజ్‌, ప్రమాదకరమైన సరుకులు నిల్వచేసే షెడ్‌ వంటి సౌకర్యాలను కల్పించినట్లు మంత్రి చెప్పారు.

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి