డా. మంగళంపల్లి కి స్వర్ణ కంకణ ప్రధానం

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు “పద్మ విభూషణ్” డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారిని పౌర సన్మానం మరియు స్వర్ణ కంకణం తో సత్కరించనున్నట్లు నాట్స్ అధ్య క్షులు శ్రీ రవి ఆచంట మరియు…

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు “పద్మ విభూషణ్” డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారిని పౌర సన్మానం మరియు స్వర్ణ కంకణం తో సత్కరించనున్నట్లు నాట్స్ అధ్య క్షులు శ్రీ రవి ఆచంట మరియు గజల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్య క్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. 
 
పాలకొల్లులోని శ్రీ బొండాడ వెంకటరాజు గుప్తా మునిసిపల్ ఓపెన్ ఎయిర్ ధియేటర్ లో 2015 మార్చి 7,8,9 తేదీలలో నిర్వహించే 8వ జాతీయ స్థాయి నాటకోత్సవాలలో ప్రారంభ సభలో 7 వ తేదీ  సాయంత్రం  6 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి డా. కోడెల శివ ప్రసాద్ గారు  డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారిని  
స్వర్ణ కంకణం తో  సత్కరిస్తారని, ఈ కార్యక్రమానికి మునుపు సంగీత రధం పై  డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారిని పాలకొల్లు పురవీధులలో గౌరవంగా ఊరేగించి పౌర సన్మానానికి తోడ్కొని వెళతారని నిర్వాహకులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలలనుండి ఎంతో మంది కళాకారులు, రాజకీయవేత్తలు, ప్రముఖులు విశేషంగా పాల్గొంటునట్లు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నాటకోత్సవాలలో 8 నాటికలను ఎంపిక చేసినట్లు ప్రతి నాటికకు పది వేల రూపాయలు నగదు బహుమానం, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 
 
అదేరోజు  డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు తూర్పు గోదావరి జిల్లా   శoకరగుప్తం లో ఉన్న తన స్వస్థలానికి కూడా వెళతారని  నిర్వాహకులు తెలిపారు 
 
డా. గజల్ శ్రీనివాస్ 
అధ్య క్షులు గజల్ చారిటబుల్ ట్రస్ట్