బాలయ్య.. నేషనల్ మీడియా ఫేవరెట్!

ఆ మధ్య తన కొత్త సినిమా షూటింగ్ ముహూర్తం రోజున.. ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నప్పుడే నేషనల్ మీడియా బాలయ్యను ఒక రేంజ్ లో చూపించింది. బాలయ్య కేవలం సినీ నటుడు మాత్రమే కాదు,…

ఆ మధ్య తన కొత్త సినిమా షూటింగ్ ముహూర్తం రోజున.. ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నప్పుడే నేషనల్ మీడియా బాలయ్యను ఒక రేంజ్ లో చూపించింది. బాలయ్య కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అయినా.. అయనకు ఇలాంటి చేతి దరుసు అలవాటు అని.. బాలయ్య విజువల్స్ ను చూపించింది జాతీయ మీడియా.

ఆ వెంటనే బాలయ్య పెద్ద గ్యాప్ ఏమీ లేకుండా.. నంద్యాల్లో ఒక ఫ్యాన్ చెంప పగలగొట్టి తన వాడీవేడిని చూపించాడు. ఈ సారి పక్కా ఎమ్మెల్యే హోదాతో ఇలా దురుసుగా వ్యవహరించడంతో నేషనల్ మీడియా బాలయ్య తీరును విశ్లేషించింది. బాలయ్య దురుసుకు హద్దు లేకుండా పోతోందని విశ్లేషించింది. మరి అవే అనుకుంటే.. అమితాబ్ బచ్చన్ విషయంలో బాలయ్య చేసిన దురుసు వ్యాఖ్యానాలు ఇప్పుడు నేషనల్ మీడియా వరకూ ఎక్కాయి.

ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో బాలయ్య రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ‘అమితాబ్ ఏం పీకాడు..’ అని బాలయ్య ఆకార్యక్రమంలో ప్రశ్నించాడు. మరి జాతీయ మీడియాకు ఈ సమాచారం కాస్త లేటుగా అందినట్టుంది. అందుకే.. ఇప్పుడిప్పుడు బాలయ్య మాటలను హైలెట్ చేస్తున్నారు. అమితాబ్ పై తీవ్రమైన దురుసు వ్యాఖ్యలు చేశాడు, అని బాలయ్య గురించి కథనాలు ఇస్తున్నాయి జాతీయ మీడియా వర్గాలు.

ఎందుకు అంటే.. ఇదంతా బాలయ్య అక్కసే అని, ఒక సినిమాలో నటించాలని బాలయ్య అమితాబ్ ను కోరాడని, అందుకు ఆయన నో చెప్పడంతో బాలయ్య ఇలా మాట్లాడుతున్నాడు.. అని జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదేమైనా సౌత్ నుంచి బాలీవుడ్ కు మసాలా వార్తలను ఇచ్చే సెలబ్రిటీగా నిలుస్తోంది నందమూరి నటసింహం.