Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కృష్ణ కాంబినేషన్ మరోసారి?

కృష్ణ కాంబినేషన్ మరోసారి?

హీరోలు ఎంతమంది వున్నా ఖాళీ లేరు. నిర్మాతలు రెడీగా వున్నారు. ప్రాజెక్టులు కావాలి. అందుకే సరైన సినిమా చేతిలో లేకుండా, ప్రస్తుతం వున్న డిస్కోరాజా సినిమా ముందుకు వెనక్కు ఆడుతుంటే, నిర్మాతలు అందరూ రవితేజ వైపు చూస్తున్నారు.

ఇప్పటికే డిస్కో రాజా తరువాత టాగోర్ మధు-గోపీచంద్ మలినేని కాంబినేషన్ కు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు కూడా రవితేజ పచ్చజెండా ఊపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఖైదీ 150 లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చినా, ఇంటిలిజెంట్ దెబ్బకు సరైన ప్రాజెక్టు చేతిలో లేని దర్శకుడు వివి వినాయక్ చెప్పిన ఓ లైన్ కు రవితేజ ఓకె చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో కృష్ణ లాంటి భారీ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. చిత్రంగా ఈ సినిమాను టాగోర్ మధు ఒకప్పటి భాగస్వామి బుజ్జి నిర్మిస్తారని టాక్. అంటే విడిపోయిన పార్టనర్లు ఇద్దరికీ రవితేజ చెరో సినిమా చేస్తారని అనుకోవాలి.

కానీ ఇక్కడ చిన్న సమస్య వుంది. వివి వినాయక్ నిర్మాత సి కళ్యాణ్ కు ఓ సినిమా చేయాలి. హీరో బాలకృష్ణ కోసం సెట్ చేసిన ప్రాజెక్ట్ అది. కానీ అది సెట్ కాలేదు. మరి రవితేజ సినిమా తానే చేస్తారని సి కళ్యాణ్ అంటారో? లేక తరువాత చేస్తారో చూడాలి.

గోపీచంద్ మలినేని అయితే ఇప్పటికి ఒకటికి రెండుసార్లు స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చారు. వివి వినాయక్ మాత్రం ఇంకా చెప్పాల్సి వుందని తెలుస్తోంది.

అమరావతి ఇంట్లో జగన్ ఎందుకు ఉండటం లేదంటే! 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?