Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ ఆలోచనలు మారుతున్నాయ్

మహేష్ ఆలోచనలు మారుతున్నాయ్

సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత సినిమా ఏమిటి? అంటే.. వంశీపైడిపల్లి - దిల్ రాజు ప్రాజెక్టు అని సినిమా వార్తలతో నిత్యం టచ్ వున్నవారు ఎవరైనా చెబుతారు. కానీ లేటెస్ట్ గా ఇంకో విషయం వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును ఓ సినిమా వెనుకగా స్టార్ట్ చేసే ఆలోచన కూడా వుందని తెలుస్తొంది.

దీనికన్నా ముందుగా కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలు సాగుతున్నట్లు బోగట్టా. ప్రస్తుతం కేజిఎఫ్ 2 ప్రాజెక్టుతో బిజీగా వున్న ప్రశాంత్ నీల్ ఫ్రీ కావడానికి, కొత్త స్క్రిప్ట్ రెడీ చేయడానికి టైమ్ పడుతుంది. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ రెడీ కావడానికి కూడా ఇంకా చాలా టైమ్ వుంది. మహేష్ బాబు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత నాలుగైదు నెలలు వేచి వుండడానికి ఇప్పటికే ప్రిపేర్ అయిపోయారు.

వంశీ పైడిపల్లి ఈసారి మాంచి కమర్షియల్ సబ్జెక్ట్ ప్రిపేర్ చేసే పనిలో వున్నారు. అందువల్ల అది ఎప్పుడు అయితే అప్పుడు చేసేలాగా, ఈలోగా ప్రశాంత్ నీల్ సబ్జెక్ట్ కనుక రెడీ అయితే అది చేసేలా మహేష్ క్యాంప్ లో ఆలోచనలు సాగుతున్నాయని తెలుస్తోంది.

వంశీ పైడిపల్లితో మంచి రిలేషన్ వున్నందున, వెనక్కు పెట్టినా సమస్య కాదు. ప్రశాంత్ నీల్ తో చేయడం ద్వారా కొత్త టచ్ వున్న సబ్జెక్ట్ స్టార్ట్ చేయవచ్చు. ఇదీ ఆలోచనల వెనుక పాయింట్. కానీ ఏ విషయం కూడా మరో నాలుగైదు నెలల వరకు అంత పక్కాగా బయటకు రాదు.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?