మళ్లీ జగనే దిక్కు

దగ్గుబాటి వారసుడు రాణా ఇంతవరకు హీరోగా క్లిక్‌ కాలేదు. ఎంతటి భారీ సినిమా అయినా నిర్మించే సత్తా ఉన్న తండ్రి ఉన్నా… రెండు స్టూడియోలు చేతిలో ఉన్నా.. వెంకటేష్‌ అభిమానుల అండదండలు ఉన్నా కానీ…

దగ్గుబాటి వారసుడు రాణా ఇంతవరకు హీరోగా క్లిక్‌ కాలేదు. ఎంతటి భారీ సినిమా అయినా నిర్మించే సత్తా ఉన్న తండ్రి ఉన్నా… రెండు స్టూడియోలు చేతిలో ఉన్నా.. వెంకటేష్‌ అభిమానుల అండదండలు ఉన్నా కానీ రాణాకి ఇంతవరకు కాలం కలిసి రాలేదు. అందుకే హీరో వేషాలు పక్కనపెట్టి సైడ్‌ క్యారెక్టర్లు కూడా చేసేస్తున్నాడు. 

బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు రిలీజ్‌ అయిన తర్వాత రాణా కెరీర్‌ టర్న్‌ తీసుకుంటుందని అంచనాలున్నాయి. ఆ తర్వాత స్టార్‌ డైరెక్టర్ల సినిమాల్లోనే నటించాలని రాణా చూస్తున్నాడు. కానీ స్టార్‌ డైరెక్టర్లంతా సూపర్‌స్టార్లతో బిజీగా ఉంటున్నారు. ఎటొచ్చీ ఖాళీగా ఉంది పూరి జగన్నాథ్‌ ఒక్కడే. అందుకే రాణా హీరోగా నటించే మలి చిత్రం పూరి డైరెక్షన్‌లోనే ఉంటుందని టాక్‌. 

సురేష్‌బాబు నిర్మించే ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌ మీదకి వెళ్లేదీ ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ కాంబినేషన్‌ మాత్రం అంత ఎక్సయిట్‌ చేసే అవకాశం లేదు. ఎందుకంటే రాణాతో ఆల్రెడీ పూరి ‘నేను నా రాక్షసి’ తీసాడు. అది ఎంత పెద్ద డిజాస్టర్‌ అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.