‘మనం’ దర్శకుడి మరో సృష్టి

‘మనం’ సినిమాతో అద్భుతాన్ని ఆవిష్కరించిన దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ తన మలి చిత్రాన్ని తమిళ హీరో సూర్యతో చేస్తున్నాడు. ‘24’ అనే టైటిల్‌తో రూపొందే ఈ చిత్రం సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ అని తెలిసింది.…

‘మనం’ సినిమాతో అద్భుతాన్ని ఆవిష్కరించిన దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ తన మలి చిత్రాన్ని తమిళ హీరో సూర్యతో చేస్తున్నాడు. ‘24’ అనే టైటిల్‌తో రూపొందే ఈ చిత్రం సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ అని తెలిసింది. విభిన్నమైన ఆలోచనలున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్‌ కుమార్‌ ఈసారి కూడా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో చేస్తున్నాడట. 

మనం చూసి బాగా ఇంప్రెస్‌ అయిన సూర్య వెంటనే తనతో ఒక సినిమా చేయమని ప్రపోజల్‌ పెట్టాడు. విక్రమ్‌ కుమార్‌ చెప్పిన కథ బాగా నచ్చడంతో సూర్య ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తాడు. పి.ఎస్‌. వినోద్‌ ఛాయాగ్రాహకుడు. సూర్య ఇందులో త్రిపాత్రాభినయం చేస్తాడని విశ్వసనీయ సమాచారం. 

వచ్చే జనవరిలో షూటింగ్‌ మొదలయ్యే ఈ చిత్రం నిర్మాణానికి ఏడాది పైగానే సమయం పడుతుందని, 2016 ద్వితీయార్థంలో విడుదలవుతుందని తెలిసింది. 24లో సూర్య సరసన నటించే హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఫిక్స్‌ కాలేదు. సమంత లేదా శృతిహాసన్‌కి ఛాన్స్‌ దక్కే అవకాశాలున్నాయి.