ఆ సినిమా ఆగిపోయిందా పవన్..?

జాలీ ఎల్లెల్బీ సినిమా టాపిక్ ఒక్కసారిగా తెలుగు తెరపైకి వచ్చింది. హారిక-హాసిని లాంటి పెద్ద బ్యానర్ ఈ సినిమా రైట్స్ కోసం ఏకంగా కోటి 70లక్షలు వెచ్చించడం ఈ చర్చకు కారణమైంది. దీనికి తోడు…

జాలీ ఎల్లెల్బీ సినిమా టాపిక్ ఒక్కసారిగా తెలుగు తెరపైకి వచ్చింది. హారిక-హాసిని లాంటి పెద్ద బ్యానర్ ఈ సినిమా రైట్స్ కోసం ఏకంగా కోటి 70లక్షలు వెచ్చించడం ఈ చర్చకు కారణమైంది. దీనికి తోడు ఈ రీమేక్ కు లింక్ చేస్తూ పవన్, త్రివిక్రమ్ లాంటి స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ జాలీ ఎల్లెల్బీ రీమేక్ లో పవన్ నటిస్తాడా..? ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అతడు ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టు సంగతేంటి..?

ఏఎం రత్నం సమర్పణలో నేసన్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీకి కొబ్బరికాయ కూడా కొట్టాడు పవన్. మరోవైపు నేసన్,  తమన్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా పాల్గొన్నాడు. అయితే జాలీ ఎల్లెల్బీ రాకతో ఇప్పుడా సినిమాపై అనుమానాలు ఎక్కువయ్యాయి. నేసన్ సినిమా స్థానంలో జాలీ ఎల్లెల్బీ వచ్చే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

నిజానికి నేసన్ ప్రాజెక్టుపై అనుమానాలు ఇప్పటివి కాదు. ఆ సినిమా ఆగిపోయిందంటూ చాలా రోజుల నుంచే ప్రచారం సాగుతోంది. జాలీ ఎల్లెల్బీ కంటే ముందే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరపైకి వచ్చింది. ఏఎం రత్నం-నేనన్ సినిమా స్థానంలో పవన్ తో ఓ సినిమా చేసేందుకు ఆ నిర్మాతలు రెడీ అవుతున్నారట.

సో.. ప్రస్తుతం నడుస్తున్న ఈక్వేషన్స్ చూస్తుంటే ఏఎం రత్నం సినిమా ఆగిపోయినట్టే కనిపిస్తోంది. ఈమధ్య తమన్ కూడా ఈ సినిమాపై స్పందించడానికి నిరాకరించాడంటే, అది అనుమానాలకు మరింత తావిస్తోంది. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత కానీ పవన్ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ రాదు.