Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పివీపీ సినిమా - ఏం జరుగుతోంది?

పివీపీ సినిమా - ఏం జరుగుతోంది?

పీవీపీ సంస్థ ఎవరితో అగ్రిమెంట్లు చేసుకున్నా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు వుండడం కామన్. ఆర్య అయినా,  అనుష్క అయినా, నాగ్ అయినా, వంశీ పైడిపల్లి అయినా. అదే విధంగా మహేష్ బాబుతో కూడా మరో సినిమా వుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో. ఈ కథ ఎప్పుడో ఒకె అయింది. కానీ ఇప్పుడు కొత్తగా ఈ సినిమా డైలమాలో పడిందని వదంతులు గుప్పు మంటున్నాయి.

వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే ఈ మేరకు ఫీలర్లు వినిపించాయి. నమ్రత ఓ ఆంగ్ల దినపత్రిక కు ఇంటర్వూ ఇచ్చినపుడు, పివిపి బ్యానర్ సినిమా గురించి అడిగినపుడు, సున్నితంగా తప్పించుకోవడమే కాక, ఆ విషయం ఏమీ ఆర్టికల్ లో ప్రస్తావించవద్దని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసినట్లు వదంతులు వినిపించాయి. దాంతో అనుమానాలు బయల్దేరాయి. నమ్రతకు పివిపి బ్యానర్ లో మరో సినిమా చేయడం అంతగా ఇష్టం లేదంటూ. 

ఇప్పుడు లేటెస్ట్ గా వంశీ పైడిపల్లి ప్రాజెక్టును నిర్మాత దిల్ రాజు టేకోవర్ చేసారంటూ వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయంపై పివిపి వర్గాలు మౌనంగా వున్నాయి. కానీ తెరవెనుక ఏదో జరుగుతోందని వార్తలు వినవస్తున్నాయి. అవి పివిపి సంస్థ ఎలాగైనా మహేష్ తో సినిమా నిర్మించే దిశగా కావచ్చు, లేదా దిల్ రాజును ముందు పెట్టి కథ నడిపించే దిశగా కావచ్చు..లేదా ఇంకేదైనా కావచ్చు. అయితే ఒక్క విషయం మాత్రం కీలకం. బ్రహ్మోత్సవం వల్ల దారుణాతి దారుణంగా నష్టపోయిన వారిని ఆదుకునే బాధ్యత పివిపి ది మాత్రమే కాదు. మహేష్ బాబుది కూడా.

నిర్మాతను మార్చేయడం ద్వారా నమ్రత ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నారేమో అన్న వదంతులు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?