స‌మంత‌+ప్రణీత‌… మ‌రి ఇంకొక‌రెవ‌రు?!

అల్లు అర్జున్ త‌దుప‌రి ముగ్గుర‌మ్మాయిల‌తో క‌లిసి న‌టించ‌బోతున్నాడు. నిన్నటిదాకా ఒక హీరోయిన్‌కే ప‌రిమిత‌మైన అల్లు అర్జున్‌… పూరి చొర‌వ‌తో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. అందుకే ఆ సినిమాకి `ఇద్దర‌మ్మాయిల‌తో` అని పేరు పెట్టాడు…

అల్లు అర్జున్ త‌దుప‌రి ముగ్గుర‌మ్మాయిల‌తో క‌లిసి న‌టించ‌బోతున్నాడు. నిన్నటిదాకా ఒక హీరోయిన్‌కే ప‌రిమిత‌మైన అల్లు అర్జున్‌… పూరి చొర‌వ‌తో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. అందుకే ఆ సినిమాకి `ఇద్దర‌మ్మాయిల‌తో` అని పేరు పెట్టాడు పూరి. ఇప్పుడేమో త్రివిక్రమ్‌… మ‌రొక‌రిని యాడ్ చేశాడు. 

అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ తీయ‌బోయే సినిమాలో మొత్తం  ముగ్గురు  హీరోయిన్లు ఉంటారు. ఆ ముగ్గురు హీరోయిన్లలో మూడో అమ్మాయి ఎవ‌ర‌న్న విష‌యంపై ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌ర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రధాన క‌థానాయిక‌గా స‌మంతని ఎంపిక చేసుకొన్నట్టు స‌మాచారం. రెండో క‌థానాయిక‌గా మ‌ళ్లీ ప్రణీత‌కే అవ‌కాశ‌మివ్వాల‌ని త్రివిక్రమ్ భావిస్తున్నాడ‌ట‌. 

ఇప్పుడు మూడో అమ్మాయి గురించే అన్వేష‌ణ కొన‌సాగిస్తున్నారు. మ‌రి ఆ ప్లేస్ ఎవ‌రు సొంతం చేసుకొంటార‌న్నదే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అక్టోబ‌రులో ప్రేక్షకుల ముందుకొచ్చేలా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు స‌మాచారం. ఇప్పటికే క‌థ, క‌థ‌నాలు సిద్ధమైన ఈ చిత్రం ఏప్రిల్ 10న కొబ్బరికాయ కొట్టుకోబోతోంద‌ని స‌మాచారం.