Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రీవిష్ణు కూడా హరీష్ కు నో అన్నారు

శ్రీవిష్ణు కూడా హరీష్ కు నో అన్నారు

దర్శకుడు హరీష్ శంకర్ తలకెత్తుకున్న మల్టీస్టారర్ కు హీరో శ్రీవిష్ణు కూడా నో అనేసినట్లు తెలుస్తోంది. జిగర్తాండ సినిమా ఆధారంగా తెలుగులో తెరకెక్కించే ఈ సినిమాకు మెయిన్ హీరో వరుణ్ తేజ్. మరో హీరో కూడా కావాలి. రెండో హీరో కోసం వెదికి వెదికి ఆఖరికి శ్రీవిష్ణు దగ్గర సెటిల్ అయ్యారు హరీష్ శంకర్.

కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న సంగతి ఏమిటంటే, శ్రీవిష్ణు కూడా నో చెప్పేసారని. అందుకే ఆఖరికి తెలుగులో ఎవ్వరూ దొరకక, తమిళ సినిమా రంగం నుంచి ఓ హీరోను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి తమిళ హీరో మురళి కొడుకు అయిన అధర్వను రెండో హీరోగా తెచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూట్ ప్రారంభమైంది. ఎఫ్ 2 తరువాత వరుణ్ తేజ్ చేసే సినిమా ఇదే. ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?