బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ మ‌న‌స్తాపం

అన‌సూయ మ‌న‌సు మ‌న‌స్తాపానికి గురైంది.  ఓ యువ జ‌ర్న‌లిస్టు మ‌ర‌ణం ఆమెను కుంగ‌దీసింది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఆవేద‌న‌, ఆక్రంద‌న‌ను వ్య‌క్తం చేసింది. బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్ అన‌సూయ త‌న అభిప్రాయాల‌ను…

అన‌సూయ మ‌న‌సు మ‌న‌స్తాపానికి గురైంది.  ఓ యువ జ‌ర్న‌లిస్టు మ‌ర‌ణం ఆమెను కుంగ‌దీసింది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఆవేద‌న‌, ఆక్రంద‌న‌ను వ్య‌క్తం చేసింది. బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్ అన‌సూయ త‌న అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్న విష‌యం తెలిసిందే.

క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ వేళ‌లో అనేక సామాజిక అంశాల‌పై అన‌సూయ త‌న‌దైన రీతిలో ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ క్ర‌మంలో మ‌రో విషాదంపై ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కరోనాతో యువ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతి చెంద‌డంపై అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సంద‌ర్భంగా అనసూయ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు.

`ఇది నన్ను చాలా బాధించింది. జ‌ర్న‌లిస్ట్ మ‌నోజ్‌కుమార్‌ నాకు తెలుసు. వృత్తిలో భాగంగా ధైర్యంగా పనిచేసే ఎంతో మంది జర్నలిస్టు మిత్రులు నాకు తెలుసు. ఎవరి గురించీ ఇలాంటి వార్త వినాలనుకోవడం లేదు. అందరి గురించి నేను ఆందోళన చెందు తున్నా. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి` అని అనసూయ ట్వీట్ చేశారు. అలాగే జర్నలిస్టు మిత్రులందరూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. అన‌సూయ ట్వీట్ జ‌ర్న‌లిస్ట్ స‌ర్కిల్‌లో వైర‌ల్ అయింది.